ఈనెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానున్నది. సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన 4వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు కేబినెట్ సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గెలుపుపై సీఎం కేసీఆర్ ధీమాతో ఉన్నారు. రెండు రోజులు ఎలాంటి ఆందోళన లేకుండా ఉండాలని తనను కలిసిన నేతలతో సీఎం కేసీఆర్ అన్నారు. ఎగ్జాక్ట్ ఫలితాలు కళ్లముందు ఉంటాయని కేసీఆర్ వారికి వివరించారు.