సనాతన ధర్మపరిరక్షణకు, వేద సంప్రదాయాలు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు. టీటీడీ పాలకమండలి కట్టుబడి పని చేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా డీవీఆర్కే ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. హైందవ దర్మాన్ని అందరూ ముందుకు తీసుకు వేళ్ళలని కరుణాకర్ రెడ్డి అన్నారు. దళిత గోవిందను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి దేవాలయాల నిర్మాణల రూపకల్పనతో పాటు నిత్య దీప, దూప నైవేద్యం అందిచామని తెలిపారు. ప్రధాన నగరాల్లో ఉన్న ఆలయాలకు లోకల్ అడ్వయిజరీ కమిటీలను వేసి ఆలయాలను అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేస్తున్నామన్నారు. గడిచిన నాలుగేళ్ళలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సుమారు 2500లకు పైగా ఆలయాలను నిర్మించడంతో పాటు కొన్నింటిని పునర్నిర్మించామన్నారు. వేద సంస్కృతిని కాపాడటంతో పాటు వేద విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులు బాగుపడేలే ఎప్పటికప్పుడు టీటీడీ అనుబంధ విశ్వ విద్యాలయాలు కృషి చేస్తున్నాయన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చేందుకు టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా నిత్యం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో వాటిని మరింతగా పెంచుతామని వెల్లడించారు. ఈ సందర్భంగా డీవీఅర్కే ప్రసాద్కు నియామక పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.
Hyderabad
సికింద్రాబాద్ లో బిజెపి పార్టీ రెబల్ అభ్యర్థి. బండపల్లి సతీష్ గౌడ్ .సికింద్రాబాద్ నియోజకవర్గము బిజెపి నాయకుడు బండపల్లి సతీష్ గౌడ్ బిజెపి పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలబడనున్నాడు. సికింద్రాబాద్ లో బిజెపి పార్టీకి గత 10 సంవత్సరాల నుండి కష్టపడి పని చేశాను. గత ఎలక్షన్ లో సికింద్రాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పద్మారావు గౌడ్ పై ఓడిపోయాను. గడిచిన పదేళ్లలో సికింద్రాబాద్ ప్రజలతో మమేకమై ప్రజలకు సేవలు చేస్తున్నాన న్నారు. సికింద్రాబాద్ లో బూతు స్థాయి కార్యకర్తలు, నాయకులను కలుపుకొని పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. కష్టపడి పనిచేసిన వారికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదన్నారు.ఎన్నోసార్లు ఫోన్ చేసిన ఇప్పటివరకు ఫోన్ కూడా ఎత్తకుండా సమాధానం కూడ ఇవ్వలేదన్నారు.సికింద్రాబాద్ నియోజకవర్గం సర్వేలో మొదటి వరుసలో నా పేరు ఉందని అన్నారు. సర్వేలో జీరో స్థానంలో ఉన్న మేకల సారంగపానికి టికెట్ ఎలా ఇస్తారన్నారు. ఇప్పుడు కూడ బిజెపి పార్టీ సిద్ధాంతాలతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తూ సికింద్రాబాద్ నుండి బిజెపి పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సతీష్ తెలిపారు.ఇప్పుడు కూడ బిజెపి పార్టీ కి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధినాయకత్వం ఆలోచించి నాకు బిజెపి పార్టీ టికెట్ ఇస్తే పద్మారావు గౌడ్ మీద గెలిచి కేంద్రానికి కానుక గా ఇస్తానన్నారు.సికింద్రాబాద్ తో పాటు బండారు దత్తాత్రేయ కూతురు కూడా టికెట్ ఇవ్వకపోవడానికి వెనకాల ఉన్న రహస్యం ఎంటన్నారు? ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాను.ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నానని సతీష్ మీడియా తో మాట్లాడారు.
కూకట్ పల్లి నియోజకవర్గం లో మరోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు తద్యమని అన్నారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేపి.హెచ్.బి డివిజన్ లోని వసంత నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రచార కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తో కలిసి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత పాలకుల సమయంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎన్ని కష్టాలు పడ్డాము ప్రతి ఒక్కరికి తెలుసని మరల అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
డ్రేనేజీ, వాటర్ ప్రభుత్వ స్దలాలు కాపాడుటకై తాము చిత్తశుద్దితో పని చేస్తామని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్ది కొలన్ హన్మంత్ రెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ది కొలన్ హనుమంత్ రెడ్డి బాచుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ లో రోడ్ల గుంతలమయం అవ్వడంతో గతంలో బాచుపల్లి రెడ్డి లాబ్స్ దగ్గర్లో తండ్రీ కూతురు బస్ కింద పడిన ఘటన, బాచూపల్లి ఇందరమ్మ కాలనీలో నీళ్ల సమస్య, స్కూల్ పిల్లల స్కూల్ కి వెళ్ళాలి అంటే రోడ్ల పైన సాహసం చేయాల్సిన దుస్థితి, దేవేందర్ నాగర్ పేట్ బషీరబాద్ లలో ప్రభుత్వ స్దలాలు కబ్జాకు గురైయ్యాయని…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్రైనేజీ, వాటర్, డెవలప్ మెంట్ తదితర అన్ని సమస్యల పట్ల చిత్తశుద్దితో పని చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ BRS సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డి BRS కు రాజీనామా చేసిన విషయాన్ని తెలుసుకొని ఆయనను పార్టీలోకి ఆహ్వానించడానికి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెల్లాడు. రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో కొలన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరుతాడని కొలన్ హన్మంతరెడ్డి తెలిపాడు.
ప్రచారంలో డాక్టర్ కోట నీలమకి అడుగడుగునా ప్రజలు ఘననిరాజనం. సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట్ డివిజన్ బల్కంపేట లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో డాక్టర్ కోట నీలమ కి అడుగడుగునా ప్రజలు ఘననిరాజనం. ఈ సందర్భంగా డాక్టర్ కోట నిలిమ మాట్లాడుతూ కాంగ్రెస్ ట్రైనింగ్ ఏంటి అంటే భయంతో గాని బెదిరింపులతో కానీ ఓట్లు ఎలక్షన్స్ గెలవాలని కాంగ్రెస్ పార్టీకి ఉద్దేశం ఉండదు నీలిమ. ప్రేమతో అభిమానంతో ఓటర్స్ రెస్పెక్ట్ సంపాదించుకోవాలి వాళ్ల మనసు గెలుచుకోవాలి వాళ్ళ అభిమానం గెలుచుకోవాలి ఆ తర్వాత ఓటు అడగాలి ఆ తర్వాత ఎలక్షన్ గెలవాలి ఇది కాంగ్రెస్ సిద్ధాంతం బైట్ సనత్ నగర్ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ కోట నిలిమ.
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల సేపు కొనసాగింది. శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి బయల్దేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఇప్పటివరకు రూ.3,50,65,450 నగదును సీజ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా మంగళవారం రూ. 90,000 నగదును సీజ్ చేయగా ఇప్పటివరకు 3,50,65,450 నగదును సీజ్ చేశారు. పోలీస్ అథారటీ ద్వారా 4,90,470 సీజ్ చేయగా ఇప్పటివరకు 48,88,,56,881 నగదును సీజ్ చేశారు. ఎఫ్.ఐ.ఆర్ లు 12 నమోదు కాగా ఇప్పటి వరకు 612 నమోదు చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను ఈ రోజు 5 సేకరించగా ఇప్పటి వరకు 4,558 ఆయుధాలను సేకరించడం జరిగింది. సి.ఆర్.పి సి 8 నమోదు కాగా ఇప్పటి వరకు 887 కేసులు నమోదయ్యాయి. నేడు 16 బైండోవర్ చేయగా ఇప్పటి వరకు 2,332 బైండోవర్ చేయడం జరిగింది. నక్కాస్ ఆపరేషన్ 108 ఇప్పటి వరకు 2,321 నక్కాస్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. నేడు నాన్ బెయిలబుల్ వారంట్ 261 నమోదు కాగా ఇప్పటి వరకు 2076 నాన్ బెయిలబుల్ వారంట్ లను నమోదు చేశారు.
మహేశ్వరం నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి KLR మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి ఇంటికి వచ్చి నేను ఇక ముందు నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. నా చెల్లెలు అయిన పారిజాత నర్సింహ రెడ్డి లకు హామీ ఇస్తున్నా వారికి రాహుల్ గాందీ , ప్రియాంక గాంధీ లేదా సోనియా తో మాట్లాడిస్తనని హమీ ఇస్తున్నారు. తప్పకుండా పారిజాత నర్సింహారెడ్డి కి గౌరవ మైన స్థానం కల్పిస్తానని తెలుపుతున్నారు. ఎమ్మెల్యే పోటీ చేసి న తరువాత ఎంపీ కూడా ఇక్కడి నుండి పోటీ చేస్తానని అన్నారు. నాకు ఎక్కడ ఇల్లు లేదు. కేవలం తుక్కుగుడ లో నే ఉన్నది కాబట్టి నేను ఇక్కడ గట్టిగా పోటీ చేసి సభితమ్మ ను ఓడించి తీరుతామని ఆ పోరాటం లో పారిజాత నుండి పూర్తి సహకారం అందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పకుండా నర్సింహ రెడ్డి మరియు పారిజాత గారికి రాత పూర్వకంగా అధిష్టానం నుండి తెలుప్తని అని అన్నారు. మహేశ్వరం నుండి కాంగ్రెస్ అన్ని చోట్ల నాయకులు కార్యకర్తలు ఏకమై సబితా ఇంద్రారెడ్డి ని ఓడించి తీరుతామని KLR అన్నారు.
పేదలు గొప్పగా ఉండాలనేది తమ లక్ష్యమని సనత్ నగర్ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు నగర్, నాగదేవత టెంపుల్, ఈశ్వరమ్మ బస్తీ, హమాలీ బస్తీ, చిదానందం కాలనీ తదితర ప్రాంతాలలో పాదయాత్ర గా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద మంత్రిని శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పట్టారు. ప్రచారంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈశ్వరమ్మ బస్తీ, పద్మారావు నగర్ ఏరియా బస్తీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే కనుక మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు. నిరుపేదలు అత్యధికంగా నివసించే హమాలీ బస్తీలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేడు సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సమావేశం అనంతరం ప్రధాని తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీసీ గర్జన సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బీజేపీ కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని సభకు తరలించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. సభ ఏర్పాట్లను పార్టీ ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. ఎజెండాతోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న బీసీ ఓట్లను దక్కించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, అయితే మరే ఇతర పార్టీ వారికి రాజ్యాధికారం ఇవ్వదనే కోణంలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కడం బీజేపీతోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో తెలంగాణలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అని ప్రకటించారు. బీసీ సీఎం విషయంలో బీజేపీ నేతలు ప్రచార అస్త్రంగా వాడి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించనున్నారు. బీసీ గర్జన సభలో ప్రధాని మోడీ ప్రకటించి బీసీ డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు, హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.






Total views : 200828