ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం నియోజకవర్గం ఈ నెల 19వ తేదీన హుజురాబాద్ ఎమ్మెల్యే, బిజెపి స్టార్ క్యాంపైనర్ ఈటెల. రాజేందర్ గోదావరిఖనికి రానున్నారని బిజెపి పార్టీ అభ్యర్థి కందుల సంధ్యారాణి తెలిపారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా మంచిర్యాలకు చేరుకుంటారని అక్కడ సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన గోదావరిఖనికి రానున్నారని మొదటగా గోదావరి నది బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగే సభకు హాజరవుతారని సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సంధ్యారాణి ఒక ప్రకటనలో కోరారు.
Karimnagar
రామగిరి మండలం లంకకేసరం గ్రామం లోని కేసరం చెరువు భూమిని అక్రమంగా కబ్జా చేసిన అధికార BRS పార్టీ గ్రామ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని CPM పార్టీ డిమాండ్ చేస్తుంది. శుక్రవారం మంథని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో AO తూము రవీందర్ కు CPM పార్టీ అధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా CPM పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ గత 30సంవస్ట్రాల క్రితం అప్పటి ప్రభుత్వం లంకకేసారం గ్రామ దళితులకు కేసారం చెరువు శిఖం భూములు సర్వే నంబర్ 75 లో గల భూములను దళితులకు ఇచ్చి ప్రొసీడింగ్స్ కాపీలు ఇచ్చారని అప్పటి నుండి అట్టి భూమిలో దళితులు సాగు చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నారు అని అన్నారు. ఈ మధ్య కాలంలో అధికార BRS పార్టీ గ్రామ సర్పంచ్ దళితుల భూముల పై కన్నేసి అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా ఆక్రమించి చెరువు శిఖం భూమిలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నరు అని అన్నారు గత వారం రోజుల క్రితం రామగిరి తహశీల్దార్ గారికి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి చెరువు శిఖం భూమి కబ్జా పై విచారణ చేపట్టి గ్రామ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని ఓట్ల కోసం గ్రామానికి వచ్చే BRS న్యాయకులను నిలదీయాలని కోరారు. ఈ కార్యక్రమం లో CPM నాయకులు ఆర్ల సందీప్, గ్రామస్థులు ఇరుగురాల సతీష్, ఇరుగురల రమేష్, ఇరుగురాల పవన్, తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని ఓసిపి 5 బొగ్గుగని పై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా గెలిపించాలని కార్మికులను కోరారు. తన వంతుగా కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్ , తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని పలు మసీదుల వద్ద వివిధ రాజకీయ పార్టీల నేతలు ముస్లిం సోదరులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. శుక్రవారం ముస్లింల ప్రత్యేక నమాజు ల అనంతరం పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. పోటాపోటీగా పార్టీల ప్రచార నినాదాలతో మసీదుల వద్ద అభ్యర్థుల అనుచరులు సందడి చేశారు. కాగా అభ్యర్థులు ఒకరికొకరు తారస పడిన ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తమ ప్రచారం ముగించుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also….
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలను మరోసారి గెలుచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని సిరిసిల్ల, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, కోరుట్ల నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కరీంనగర్లో నాలుగో సారి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ రెండో విడతలో కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పాల్గొని ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభలకు భారీ జన సమీకరణతో విజయవంతం చేయడం ద్వారా పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా చర్యలు చేపట్టారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించిన కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలోనే ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. గంగాధర మండలం పత్తికుంటపల్లిలో చొప్పదండి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ, హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ప్రజా ఆశీర్వాద సభలకు కూడా భారీ జనసమీకరణ చేస్తున్నారు. మరో 13 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఆశీర్వాద సభలతో పార్టీశ్రేణులు, ప్రజల్లో గెలుపు ఖాయమనే మెస్సేజీ తెచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు.
సీఎం పర్యటన వివరాలు
- శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్నుంచి సీఎం కేసీఆర్ బయలు దేరి 12.50కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 12.55కు హెలిక్యాప్టర్లో బయలుదేరి కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ హెలీప్యాడ్ గ్రౌండ్కు 1.30కి చేరుకుంటారు. అనంతరం ఎస్సారార్ కళాశాల మైదానానికి చేరుకుని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
- 2.35కు అక్కడి నుంచి బయలు దేరి గంగాధర మండలం పత్తికుంట గ్రామానికి 2.40కి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు.
- 3.20కు అక్కడి నుంచి జమ్మికుంటకు 3.50 నిమిషాలకు చేరుకుని సభలో ప్రసంగిస్తారు.
- 4.30కు హన్మకొండ జిల్లా పరకాలకు బయలుదేరుతారు.
- సీఎం పర్యటన సందర్భంగా ఎస్సారార్ కళాశాల మైదానం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read Also..
సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాయని, సింగరేణి కార్మికులను బార్డర్లో పనిచేసే సైనికులగా గౌరవిస్తామని పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ రామగుండం అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. సింగరేణి కార్మికుల దీవెన యాత్రలో భాగంగా జీడికే టు ఎ బొగ్గు గని పై ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని రాబోయే ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని కార్మికులను కోరారు. అనంతరం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిని కలిసి తనకు ఈసారి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో బిఎస్ఎఫ్, జవాన్లతో పాటు సాయుధ పోలీసులు అంగడి బజార్ నుంచి బ్లాక్ చౌరస్తా వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల డిఎస్పి వెంకటస్వామి మాట్లాడుతూ …..ఈనెల 30న జరుగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమస్యత్మక ప్రాంతాలతో పాటు నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రత్యేక నిఘా వేసినట్లు జగిత్యాల డిఎస్పి వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ కమాండెంట్ దీపంకర్,విద్యాసాగర్, మల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఆర్ఐ.వేణు, ఎస్సైలు అశోక్, వెంకట్రావు, సతీష్, కుమారస్వామి పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్, శ్రీమతి రెమా రాజేశ్వరి , మంచిర్యాల జిల్లా డిసిపి రామ్ నాధ్ ఆదేశాల మేరకు, బెల్లంపల్లి సబ్ డివిజన్ ACP సదయ్య ఆధ్వర్యంలో, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ మార్చ్ నిర్వహించారు.. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కుని నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలని రామాలయం నుండి రాజీవ్ చౌక్ వరకు 70 మంది పోలీసులు మందమర్రి సర్కిల్ పోలీస్ సిబ్బంది మరియు CRPF, ఉమన్ బెటాలియన్ ఫోర్స్ తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించరు.
ఆనాడు చెరువు ఎండిన నాడు టిఆర్ఎస్ పార్టీ మీతోనే ఉన్నది ఇవాళ చెరువు నిండిన నాడు కూడా బీఆర్ఎస్ పెట్టి మీతోనే ఉన్నదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని బండాలింగాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంజయ్ తో కలిసి ప్రచారం లో భాగంగా ఆమె మాట్లాడుతూ మరి ఎందుకు కేసీఆర్ కు ఓటు వేయాలి అని చాలామంది మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు బండాలింగాపూర్ లోని పెద్ద చెరువు ఎలా ఉండేదని ఇవాళ ఎలా ఉందని , చెరువులు ఎండిపోయినప్పుడు కప్పలన్నీ చెరువును విడిచిపెట్టి కానీ చెరువులో చేప పిల్లలు ఉంటే చెరువు నిండిన ఎండిన అదే చెరువులో ఉంటాయని బ్రతికిన బ్రతుకుతాయి చచ్చిన చస్తాయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం చేపలాంటోల్లమని, కప్పలాంటి వాళ్లు కాంగ్రెస్ బిజెపి పార్టీ వాళ్ళని, కవిత అన్నారు. ప్రజలను ఒకటే కోరుతున్న మంచి నాయకుడు సంజయ్ అన్న మీరు కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు.
తెలంగాణ ఉద్యమం కెసీఆర్ ఇంటి వాళ్ళు ముగ్గురు చేస్తే రాలేదు తెలంగాణ నిరుద్యోగ యువత తెలంగాణ విద్యార్థులు ఆత్మబలి దానాలతో చలించిపోయిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించడం జరిగింది. తెలంగాణలో సుమారు పది లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందడం జరుగుతుంది. ఒక్కరికి పదివేల చొప్పున ఉన్నా గాని తెలంగాణకు నెలకు సుమారు 1000 కోట్లను గల్ఫ్ కెళ్ళి వీళ్ళు గల్ఫ్ కార్మికులు సంవత్సరానికి 12 వేళా కోట్లు విదేశీ మరగద్రవ్యాన్ని తెలంగాణకు సమకూరుస్తున్నారు. ఇందులో ఎంత లేకుండా సుమారు గవర్నమెంట్ కి 10% ఆదాయం అనుకున్న కానీ గత పది సంవత్సరాల నుండి గవర్నమెంట్ కు ఒక లక్ష ఇరవై వేల కోట్లను సమకూర్చడం జరుగుతుంది. కానీ గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. నువ్వు గొప్పగా చెప్పిన కాలేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఏమైంది కాలేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయింది హరీష్ రావు ఏమంటాడు ఒక బ్యారేజ్ పగులు తప్ప మిగతా ఇంకా రెండు లేవా ఒక మేడిగడ్డ కృంగిపోతేనే పెద్ద ఏదో జరిగినట్టు అంటున్నారు ప్రతిపక్షాలు మేడిగడ్డ లేకపోతే అన్నారం ఉండదు అన్నారం లేకపోతే. సుందిళ్ళ ఉండదు కేసీఆర్ అంటాడు పగులు వచ్చింది అని పగులు వచ్చిన కుండకు నీళ్లు ఆగుతాయ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటగా గల్ఫ్ కార్మికులు గల్ఫ్ లో అసువులు బాసిన ప్రతి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున కేటాయిస్తాం . ప్రభుత్వం ఏర్పడగానే స్థానికంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంతో పాటు యువతకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. జగిత్యాలలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దిగవంత నేత రత్నాకర్ రావు నేను పోటీపడి అభివృద్ధి చేసినం. నేను జగిత్యాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడితే దిగవంతనేత రత్నాకర్ రావు గారు కోరుట్లలో పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కోరుట్ల పట్టణానికి ఏం చేశాడు చెప్పాలి.





Total views : 198579