209
విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్న పాత ముద్దాయి శ్రీనుతో పాటు మరో మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నక్కపల్లి మండలానికి చెందిన శ్రీనుపై గతంలో పలు కేసులు ఉన్నాయి. ఇప్పటికే నాలుగు మోటార్ సైకిళ్లు, మూడు స్కూటీలు, రెండు సెల్ ఫోన్లు శ్రీను వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని నర్సీపట్నం టౌన్ సిఐ గఫూర్ వెల్లడించారు. శ్రీనుని అదుపులోకి తీసుకొని విచారించగా 8 బైకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. శ్రీనుని అతనికి సహాయం చేసిన బొడ్డుపల్లికి చెందిన మైనర్ బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ గఫూర్ తెలిపారు.