Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News గని కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం..

గని కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం..

by Rama
BMS

ఈనెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులను కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే 2ఏ బొగ్గు గనిపై అర్జీ1 నాయకులు హరిన్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో కేంద్ర నాయకులు సారంగపాణి రమాకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ.. గత కార్మిక సంఘాలు పోగొట్టిన హక్కులను తిరిగి సాధించేందుకు బిఎంఎస్ కృషి చేస్తుందని అన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ పరంగా పరిష్కరిస్తామని తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి ఫలితంగానే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని 27న జరిగే గుర్తింపు ఎన్నికల్లో “కాగడా” గుర్తుకు ఓటు వేసి బిఎంఎస్ ను గెలిపించాలని కార్మికులను కోరారు.

Advertisements

You may also like

Our Visitor

013691
Total views : 77957

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.