Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh అన్యాయం చేసిన చోట బస్సు యాత్ర..

అన్యాయం చేసిన చోట బస్సు యాత్ర..

by Rama
BUS Yatra

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బిసి లకు అన్యాయం చేసిన వైసిపి వినుకొండలో బస్సు యాత్ర చేయడం బాధకారమన్నారు. స్ధానిక తెలుగుదేశం పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండలో జరిగిన బస్సు యాత్ర జనాభా లేక విఫలమైందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయకుండా బస్సు యాత్ర చేసే మంత్రులు ఏం సమాధానం చెప్తారో తెలపాలన్నారు. రాష్ట్రంలో ఇన్ని కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి ఏ ఒక్క కార్పొరేషన్ కన్నా నిధులు మంజూరు చేశారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ ధోరణి వలన మంత్రులు కూడా కార్పొరేషన్ నిధులు అడగలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, ప్రజలకు రేషన్ అందజేసి ప్రజలకు లక్షల కోట్లలో డబ్బులు జమ చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఆక్రమ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలులో పెట్టారని,
జగన్మోహన్ రెడ్డి ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి 10 సంవత్సరాల నుండి బయట తిరుగుతున్నారని తెలిపారు. వరికపూడిశెల ప్రాజెక్టు నాలుగున్నర సంవత్సరాలుగా పట్టించుకోకుండా ఇప్పుడు శంకుస్థాపన చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు.

Advertisements

You may also like

Our Visitor

040944
Total views : 212473

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: