జిలాల్లో నకిలి గల్ఫ్ ఏజెంట్ల మోసలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో గతంలో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగిందని,నకిలీ గల్ఫ్ ఏజెంట్లు తీరు మార్చుకోకపోతూ ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని,గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం అని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.ఈ మేరకు శనివారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు.ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారిని మోసం చేసే ఏజెంట్ల పై జిల్లా పోలీస్ ప్రత్యేక నజర్.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా నుంచి ఉపాది నిమిత్తం గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలన్నారు.ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారు తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు చేపడతాం అని , జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితుల ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపాజిల్లా నుండి ఉపాధి కోసం వెళ్ళే వారి వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని, నకిలీ వీసాలు ఇచ్చి ,పాస్ పోర్ట్ లు దగ్గర ఉంచుకొని ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఏజెంట్ల పై జిలాల్లో గత సంవత్సరం 34 కేసులలో 38 మందిని అరెస్ట్ చేసి 09 మందిని జైలుకి తరలించడం జరిగిందని, ఈ సంవత్సరం 34 కేసులలో 58 మందిని అరెస్ట్ చేసి ఇద్దరిని జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు.ఉపాధి కోసం గల్ఫ్ వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని, గల్ఫ్ దేశాలకు వెళ్ళు వారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించి, వారి ద్వారానే వీసాలు పొందవలసిందిగా సూచించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకొనుటకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ 8712656411 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించవచ్చని సూచించారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- భోజ్శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పుమధ్యప్రదేశ్లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…
- మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ. భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. చట్టప్రకారం ఆవులు, దూడలను వధించడం పూర్తిగా…
- నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం పాటిస్తున్నాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మోదీ, చంద్రబాబు పిలుపునిచ్చిన పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు సందేశాలను ఆచరణలో చూపిస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే… ఖర్చు…
- యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..తెలంగాణవ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో…
- పంజాబ్ కింగ్స్కు వరుసగా ఐదో షాక్.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..పంజాబ్ కింగ్స్ పూర్తిగా నిరుత్సాహంగా కనిపిస్తోంది. వరుసగా ఐదో ఓటమిని చవిచూసిన వారు చాలా కాలంగా 13 పాయింట్లకే పరిమితమై ఉన్నారు. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే మరియు ఆర్ఆర్ కూడా వారికి దగ్గరగా వచ్చేశాయి. మరోసారి బౌలర్లే జట్టును నిరాశపరిచారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 78210