ఏపీలో రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్త కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై తాజా నిర్ణయం ప్రకటించారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫొటోతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో కొత్త విధానం అమలు కానుంది.కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పట్టాదారు పాసు పుస్తకాలపై ఇవాళ కీలక ప్రకటన చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలపై రాజముద్ర వేసి ఇస్తాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టాదారు పాసు పుస్తకాలను మారుస్తామని గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మార్పులు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారి అప్పటి సీఎం జగన్ బొమ్మతో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. దీనిపై అభ్యంతరాలు వచ్చినా అప్పట్లో పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ఆ బొమ్మనుతీసేసి రాజముద్ర పెడతామని చంద్రబాబు ప్రకటించారు.మీ తాత ముత్తాతలు సంపాదించిన భూమికి ఇచ్చే పాస్ పుస్తకంపై గత ప్రభుత్వం జగన్ బొమ్మ వేసుకుందని ప్రజలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు భూమికి తన బొమ్మ వేసుకోవాలా అని వారిని ప్రశ్నించారు. తాను అలా వేసుకోనని, అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలనూ మారుస్తానని తెలిపారు. బొమ్మ తీసేస్తానని, రాజముద్రతో మీ భూములు మీకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలో ఈ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
- సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
- భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
- ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో…
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.