Friday, June 5, 2026
News Navigation
Friday, June 5, 2026
News Navigation

Breaking

Friday, June 5, 2026
Home Latest News పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో…

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో…

by CVR NEWS

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో మంతనాలు జరిపారు. అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించారు. భారతీయులకు రక్షణ కల్పించాలన్నారు. సురక్షితంగా భారత్ కు పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా దేశాధినేతలకు ఫోన్ చేసి దాడుల వివరాలు కనుక్కున్నారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ సల్మాన్‌, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో కూడా మాట్లాడారు. ఆ దేశాల్లోని భారతీయుల భద్రతపై వారితో చర్చించారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ల నాయకులతో చర్చల సందర్భంగా ఆ దేశాలపై ఇరాన్ దాడులను మోదీ ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి గల్ఫ్ దేశాల నాయకులతో ప్రధాని మోదీ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్‌తో కూడా మాట్లాడారు. భారతీయుల క్షేమం కోసం కృషి చేస్తున్నందుకు ఆల్ నహ్యాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ దేశాల్లోని పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి భద్రతా కేబినెట్ కమిటీ యూఏఈలో ఉన్న భారతీయ భద్రతపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది..

Advertisements

You may also like

Our Visitor

020413
Total views : 92874

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.