పుంగనూరు నియోజకవర్గం లో జనసేన పార్టీ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ప్రతి ఒక్క జనసైనికులను గుర్తించి న జనసేన పార్టీ అధినేత పవణ్ కళ్యాణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి సిరివెలు చిన్నరాయల్. నేడు తన స్వగృహం లో జనసేన నాయకులు, జనసైనికులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతమా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల తో నియోజకవర్గ స్థాయిలో మమ్మల్ని గుర్తించి పదవి భాద్యతలు అప్పగించిన నాటి నుండి నేటి వరకు జనసేన పార్టీలో ఉన్నాం..కేంద్రం లో ప్రధానమంత్రి మోడీ వారికి కూడా ముఖ్య మైన పార్టీ గా గుర్తింపుపొందే స్థాయికి మా పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు రావడం అలాగే ఎన్నికల్లో పోటి చేసిన జనసేన పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించిందిప్రతి గ్రామం మరియు ప్రతి గడపకు వెళ్లి వారితో మమేకమై ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టిల కి తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీఏ కూటమి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ లు కలసి మహోత్తర మైన పరిపాలన అందించాలని ఆశిస్తున్నామని తెలిపారు. జనసేన పార్టీ పవణ్ కళ్యాణ్ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేర్చేందు కు కృషి చేస్తారని తెలియజేసేందుకు జనసైనికులు గా గర్వపడుతున్నామన్నారు. కార్యక్రమం లో పాముల హరి,చంద్ర, తిరుమలేషు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 200883