Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News యాభై శాతం ఉన్న బీసీ లకు..మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలి

యాభై శాతం ఉన్న బీసీ లకు..మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలి

by Rama
యాభై శాతం ఉన్న బీసీ లకు..మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కేవలం బీసీలకు రెండు మంత్రి పదవులు ఇచ్చి చేతులు దులుపుకుందని… రానున్న మంత్రి వర్గ విస్తరణలో ప్రాధాన్యత గల ఐదు మంత్రి పదవులను కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా… బీసీ లకు ఎలాంటి న్యాయం చేయలేదని… కృష్ణయ్య బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మండిపడ్డారు. నామిటెడ్, కార్పొరేషన్ పదవులలో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బీసీ ల కులగణన చేయడంతో పాటు… పంచాయతీ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోటా పెంచాలని కోరారు. అలాగే వంద గురుకుల పాఠశాలలు, 50 ఇంజినీరింగ్ కళాశాలలు, రెండు విశ్వవిద్యాలయాలు నూతనంగా ఏర్పాటు చేయాలన్నారు. పెండింగులో ఉన్న బోధన రుసుములు, ఉపకార వేతనాలు చెల్లించి… పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగించడంతో పాటు… కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పందని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039215
Total views : 194801

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: