ధర్మవరంలో ఐదేళ్ల పాటు విచ్చలవిడిగా కబ్జాలు, ఆక్రమణలు చేశారని.. వీటిన్నింటికీ ఇప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుందని టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. ధర్మవరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులను ఆయన స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ తో కలసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. 28 వ వార్డులో వాటర్ ట్యాంక్, సిద్దయ్యగుట్టలోని సాయిబాబా వాటర్ ట్యాంక్, ఎల్.పి.సర్కిల్లోని అన్న క్యాంటీన్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. అమృత్ స్కీమ్ కింద మంజూరైన పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంపై శ్రీరామ్ ఆరా తీశారు. వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలని అధికారులను కోరారు. అలాగే ఐదేళ్లుగా మూతపడ్డ అన్న క్యాంటీన్ల పరిస్థితిని స్వయంగా చూశారు. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి పనులు ఎక్కడ ఆగిపోయాయి ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు వచ్చానన్నారు. అలాగే పేద ప్రజలకు తక్కువ ధరకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పై కక్షతో ప్రజలకు పెట్టే భోజనాన్ని దూరం చేశారన్నారు. త్వరలోనే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. అలాగే వార్డుల వారిగా సమస్యలు ఏమున్నాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న దానిపై ఒక సమీక్ష చేసుకుని మంత్రి సత్యకుమార్ సహకారంతో వాటన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. మరోవైపు తాము ఎక్కడ అభివృద్ధి చేస్తామోనన్న భయంతో వైసీపీ నాయకులు వారి పత్రిక ద్వారా విషం చిమ్మిస్తున్నారన్నారు. ఐదేళ్ల పాటు మున్సిపల్ స్థలాలు కబ్జా చేసి, ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసిన వారిని ఊరికే వదిలేదిలేదన్నారు. వాటిన్నింటిపై చర్యలు ఉంటాయన్నారు. ఇన్ని రోజులు స్వైర విహారం చేసి.. ఇప్పుడు కూడా అలాగే ఉంటామంటే.. ఊరుకునేది లేదన్నారు. ఆరోజు ధర్మవరంలో ప్రశాంతత కోసం పరిటాల రవి కృషి చేశారని.. ఇప్పుడు కూడా తాము ప్రశాంతత కోసం పని చేస్తామన్నారు. వైసీపీ నాయకులు వారి హద్దుల్లో ఉంటే బాగుంటుందని.. అలా కాదంటే మా నుంచి ప్రతి సమాధానం కూడా ఉంటుందని హెచ్చరించారు…..
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్కు వస్తున్న జిన్పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్పింగ్తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.