కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం మద్దూరు, కాసరనేని వారి పాలెం గ్రామాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, అరటి పొలాలను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ బలశౌరి మాట్లాడుతూ తుఫాను వలన 70 నుంచి 80 శాతం వరకు రైతులకు పంట నష్టం జరిగిందని అన్నారు. చేతికి వచ్చిన పంట నేలపాలు అవ్వడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. పంట నష్ట సేకరణ త్వరగా సేకరించాలని అధికారులకు సూచించారు. అలాగే కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుందన్ని అని కేంద్ర ప్రభుత్వాలు కూడా విపత్తు సమయాల్లో రైతులను ఆదుకోవాలి అని అవసరమైన చట్ట సవరణ కూడా చేయాలి అని అన్నారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్ని, రైతు దగ్గర నుంచి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ధాన్యం సేకరణలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది. లేదు అని ఇనుమురేషన్ సమయంలో అధికారులు ఉదారంతో ఉండి పంట నష్ట వివరాలు సేకరించాలి అని ఆయన తెలిపారు. రైస్ మిల్లర్లు రైతులను నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దు అని అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ధాన్యం సేకరణ విషయంలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు.
70 నుంచి 80 % వరకు రైతులకు పంట నష్టం
358
previous post






Total views : 89145