Friday, May 15, 2026
News Navigation
Friday, May 15, 2026
News Navigation

Breaking

Friday, May 15, 2026
Home Telangana కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలపై కేసీఆర్ స్పందన..

కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలపై కేసీఆర్ స్పందన..

by Rama
KCR

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు, ధరణి పోర్టల్ తీసేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్…కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. రైతు బంధు వృథా అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని, ధరణి పోర్టల్ తీసేస్తామని భట్టి విక్రమార్త చెబుతున్నారన్నారు. ధరణి తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తోదన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి కర్ణాటకలో రైతులకు 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013374
Total views : 77502

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.