Friday, May 15, 2026
News Navigation
Friday, May 15, 2026
News Navigation

Breaking

Friday, May 15, 2026
Home TelanganaHyderabad మారథాన్‌ను ప్రారంభించిన సచిన్..

మారథాన్‌ను ప్రారంభించిన సచిన్..

by Satya
Sachin

హైదరాబాద్ ఆఫ్ మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించిన సచిన్ గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్సచిన్‌తోపాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా హాజరుఉత్సాహంగా పాల్గొన్న 8 వేలమంది రన్నర్లు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఉదయం నిర్వహించిన ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్‌’కు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20కే, 10కే, 5కే విభాగాల్లో నిర్వహించిన ఈ మారథాన్‌లో బ్యాడ్మింటన్ దిగ్గజం, కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. ఈ మారథాన్‌లో వయసుతో పనిలేకుండా దాదాపు 8 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఉదయం 5.15 గంటలకే 21.1కే రన్ ప్రారంభం కాగా, ఆ తర్వాత 10కే, 5కే రన్ ప్రారంభమయ్యాయి. ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మారథాన్ కార్యక్రమానికి దాని బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్ టెండూల్కర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించాడు.

Advertisements

You may also like

Our Visitor

013493
Total views : 77671

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.