Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి..

సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి..

by Rama
peddi reddy Rama chnadra reddy

విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని కనకదుర్గ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ. ” విద్యుత్ శాఖ ఇప్పటివరకు తూర్పు నియోజకవర్గం లో 42 కోట్లు ఖర్చు పెట్టింది. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ పూర్తి చేయడంలో మన ముఖ్యమంత్రి పాత్ర మరువలేనిది అని అన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం లో దేవినేని అవినాష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014678
Total views : 80796

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.