Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన – కేసీఆర్

గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన – కేసీఆర్

by Satya
KCR

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమ నియోజకవర్గాల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.గజ్వేల్ లో ఐవోసీ మైదానం వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సీఎం వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో గజ్వేల్ చేరుకుంటారు. అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎం గారితో గజ్వేల్ లో ఈనెల 28 తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.2014, 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో జరిగింది.

Advertisements

You may also like

Our Visitor

014057
Total views : 78874

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.