బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, టీపీసీసీ చీఫ్ రేవంత్ స్టేషన్ ఘనపూర్ లో తనపై చేసిన విమర్శల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాఫర్గడ్లో జరిగిన పార్టీ సమావేశంలో కడియం మాట్లాడుతూ…2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర తమ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిందని గుర్తుచేశారు. ఇందిర నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతోందని అన్నారు. ఇందిర ఒక్కరికి కూడా సాయం అందించలేదన్నారు. కానీ కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నట్లు చెప్పారు. తనపై ఎలాంటి కేసులు లేవని, కానీ రేవంత్ రెడ్డి, ఇందిరలపై ఉన్నాయన్నారు. ఇందిరపై ఇక్కడ చీటింగ్ కేసు నమోదు అయిందని, ఆ కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రజలకే అందుబాటులో ఉండని ఇందిరకు ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రజలు, మాదిగలపై ఇందిరకు ప్రేమ ఉంటే ఆమె ఆస్తులు రాసివ్వాలని సవాల్ చేశారు. ఆమె తన ఆస్తులను రాసిస్తే మరుక్షణమే తానూ రాసిస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఓ గజదొంగ అన్నారు.
రేవంత్ రెడ్డి ఓ గజదొంగ..!
301
previous post





Total views : 79455