Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home TelanganaRangareddy రైతుబంధు రాజ్యం కావాలా రాబందుల రాజ్యం కావాలా- మంత్రి సబితా

రైతుబంధు రాజ్యం కావాలా రాబందుల రాజ్యం కావాలా- మంత్రి సబితా

by Rama
sabitha reddy

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం పెద్దమ్మతండా, దావుద్ గూడతండా, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురలీనగర్ గ్రామాలలోఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న _తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అడుగడుగున జననీరాజనంతో ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. భారీగా హాజరైన గ్రామవాసులు.మేమంతా మీతోనే మీకు అండగా ఉంటామని ముక్తకంఠంతో పలికిన గ్రామాల ప్రజలు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంతోనే అన్ని రంగాలను అభివృద్ధి పరచుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరొకసారి ఆశీర్వదించి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని, అదే విధంగా మహేశ్వరం నియోజకవర్గం గడిచిన నాలుగున్నర సంవత్సరాల కిందట ఎట్లా ఉండే ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉందో ఆలోచించాలన్నారు. అభివృద్ధి చేశాను మరింత అభివృద్ధి కోసం మీ సబితమ్మను ఆశీర్వదించి మరొకసారి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నామని మరింత అభివృద్ధి కోసం మరొకసారి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి దీవించవలసిందిగా పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039390
Total views : 196621

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: