చిత్తూరు జిల్లా, పలమనేరు.. ఖరీదైన బైకులు దొంగతనం చేసే అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఓ వ్యక్తిని పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరు సిఐ చంద్రశేఖర్ కథనం మేరకు ద్విచక్ర వాహనాల దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచి గుడియాత్తం కు చెందిన లింగేశ్వరన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అతని విచారించి రూ.15 లక్షల విలువైన 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డుల కోసం సిఫార్సు చేస్తామని తెలిపారు.