Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshKadapa చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం..

చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం..

by Rama
bike accident

కడప జిల్లా… వేంపల్లి పట్టణంలోని బిడాలమిట్ట కు చెందిన షేక్ మదార్ షావల్లి(18) సయ్యద్ కాశీం బాష (35) సయ్యద్ అబ్బు (32). అనే ముగ్గురు వ్యక్తులకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. వీరు నిత్యం బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం పాములూరులో బేల్దారి పని చేసి భోజనానికి వేంపల్లె కు వచ్చి తిరిగి పాములూరు కు వెళుతుండగా పులివెందుల – కడప బైపాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108లో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేంపల్లె ఎస్ ఐ తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

013819
Total views : 78134

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.