నేపాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో ముగ్గురు బయటపడగా, మిగతా 60 మంది నీటిలో గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిశూలి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.నదికి రెండువైపులా కొండలు ఉండగా.. ఓ కొండను ఆనుకుని నారాయణ్ ఘాట్ – మగ్లింగ్ రోడ్ ఉంటుంది. బస్సులు ఈ రోడ్ పై వెళుతుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బస్సులు అదుపుతప్పి నదిలో పడ్డాయని అధికారులు వివరించారు. ఈ ప్రమాదం గురించిన సమాచారం అందగానే పోలీసులు, సైన్యం స్పందించాయని, సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. బోట్లతో త్రిశూల్ నదిలో గాలిస్తున్నారు.అయితే, వరద ఎక్కువగా ఉండడంతో గాలింపు కష్టంగా మారిందని తెలిపారు. కాగా, కొండచరియల కారణంగా నారాయణ్ ఘాట్ – మగ్లింగ్ రోడ్ ప్రస్తుతం బ్లాక్ అయిందని స్థానిక ఎస్పీ భవేష్ రిమాల్ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90705