మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కోడూరు మండలం సముద్రతీర ప్రాంత గ్రామాలైన, పాలకాయతిప్ప, ఉంటగుణం, రామకృష్ణాపురం. బసవన్నవానిపాలెం, పిండి వాని దెబ్బ , పలు గ్రామాలలోని ప్రజలను సోమవారం సాయంత్రం సురక్షిత ప్రాంతానికి తరలించి, అధికారులు ఏర్పాటు చేసిన కోడూరు స్వసంత్రపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోని పునరాలస కేంద్రాలను అదికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు సింహాద్రి పునరావాస కేంద్రాని పరిశీలించారు. కేంద్రాల్లోని ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ తుఫాన్ ప్రభావం తగ్గేవరకు పునరాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. అవసరమైన ఏర్పాట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో వల్ల ఎవరు ఆ ధైర్యం పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఎప్పుడుకప్పుడు అధికారి యంత్రంగానికి సూచనలిస్తూ అవసరమైన సదుపాయాలను సమకూర్చటం జరిగిదని అన్నారు
పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే..
281
previous post





Total views : 80707