Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News కోర్టు ఆవరణలో సూసైడ్ అటెంప్ట్..

కోర్టు ఆవరణలో సూసైడ్ అటెంప్ట్..

by Rama
Mekala posam

తనపై దాడి చేస్తే పోలీసులు పట్టించుకోవడంలేదని, తనకు న్యాయం జరగాలంటూ ఓ వ్యక్తి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోర్టు ఆవరణలో కిరోసిన్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. వెంటనే స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే స్థానిక అడ్డగుంటపల్లికి చెందిన మహేష్ అనే లాయర్ పై ఇటీవల దాడి జరిగింది. ఈ సంఘటనలో మేకల పోశం తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం తనపై కూడా దాడి జరిగింది, అంటూ మేకల పోశం పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడంలేదని, అలాగే లాయర్లు అందరూ తమకు వ్యతిరేకంగా ఉన్నారని ఆవేదన చెందాడు. ఇదే క్రమంలో ఈరోజు కోర్టు కు వెళ్లి కిరోసిన్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా పోచం కుమారుడు మాట్లాడుతూ తమపై కూడా దాడి జరిగిందని… అయితే ఇటు పోలీసులు పట్టించుకోకపోగా లాయర్లు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారని తమకు న్యాయం జరగాలని పేర్కొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: