Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh రైతులని నిండా ముంచిన మిచౌంగ్ తుఫాన్

రైతులని నిండా ముంచిన మిచౌంగ్ తుఫాన్

by Prakash
michung toofan

బాపట్ల జిల్లా, వేమురు నియోజకవర్గం, యుద్ధ ప్రాదిపదికన నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, వీధురు గాలులకు నేలమట్టమయిన లంకల ప్రాంతాలలోని వాణిజ్య పంటలు పసుపు ,కంద, అరటి నీటమునిగాయని వరి పంట చేతికొచ్చే సమయానికి తుఫాను భారీ వర్షాలు పూర్తిగా నీటమునిగి రైతులు చాలా నష్టపోయారని ఆరుగలం పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ఇలా ప్రకృతి వైపరీత్యాలు జరగటం చాలా బాధాకరం రైతులకు తీరని లోటుని మంత్రి నాగార్జున కు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాటలతో సరిపెట్టబోదని, అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం నష్టపరిహారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039129
Total views : 194371

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: