Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana రైళ్ల రాకపోకలు అంతరాయం..

రైళ్ల రాకపోకలు అంతరాయం..

by Rama
Train Snow

ఉత్తరాదిన మంచు ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నుంచి శబరిమల వెళ్లేందుకు అయ్యప్ప స్వాములు గంటల తరబడి స్టేషన్‌లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్లవారింది మొదలు పట్టణ, గ్రామీణ ప్రాంతాలు పొగమంచు తో కమ్ముకుంటున్నాయి. దీంతో రాకపోకలు సన్నగిల్లుతున్నాయి.
న్యూఢిల్లీ నుండి దక్షిణాది రాష్ట్రాలైన హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక్కో ట్రైన్ 10 నుండి 26 గంటల ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039523
Total views : 197966

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: