కడప జిల్లా… జమ్మలమడుగు మండలంలోని మోరగుడి గ్రామానికి చెందిన 50 చేనేత కుటుంబాలు వైయస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా.. కదలిరా నినాదాన్ని విశ్వసించి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేయడం జరిగిందని అన్నారు. వైకాపా ప్రభుత్వం పేద ప్రజలపై ధరల భారాన్ని మోపి ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకతను మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీడీపీ లోకి భారీ చేరిక..
262
previous post






Total views : 78098