కరీంనగర్ జిల్లా జగిత్యాలలో రైతులు ధర్నా నిర్వహించారు. NH 63 జాతీయ రహదారి నిర్మాణం కోసం చేస్తున్న సర్వే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హన్మాజీ పేట్, పెరకపల్లి, తిప్పన్నపేట, చర్లపల్లి, చల్గల్, తాటిపల్లి రైతులు జగిత్యాల పాత బస్ స్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సర్వేలో తమ భూములు కోల్పోతున్నామని వారు వాపోయారు. ప్రాణాలైనా అర్పిస్తాం కాని తమ భూములు వదులుకోమని స్పష్టం చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.
అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే.. కల్లాల్లో రైతుల కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పంటలు పండించిన పాపానికి..అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో…
ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్కరాలకు హాజరు కావాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో…
గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది. బీడీలు తయారు చేయడానికి…