Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home National సముద్ర గర్భంలో శ్రీకృష్ణునికి ప్రధాని మోదీ పూజలు

సముద్ర గర్భంలో శ్రీకృష్ణునికి ప్రధాని మోదీ పూజలు

by Satya
Modi


సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన నగరం ద్వారకను ప్రధాని మోదీ స్కూబా డైవింగ్‌ ద్వారా సందర్శించారు. జలగర్భంలో శ్రీకృష్ణుడికి భక్తిపూర్వకంగా ప్రార్థనలు జరిపారు. అనేక సంవత్సరాలుగా ద్వారకను సందర్శించాలని అనుకుంటున్నానని, ఇప్పటికి ఈ కోరిక నెరవేరిందని, ఇదొక దివ్య అనుభూతి అని సముద్రం నుంచి బయటకు వచ్చిన అనంతరం మోదీ తెలిపారు. సముద్రంలో ఉన్న ద్వారక నగర అవశేషాలను సందర్శించటానికి పంచ్‌కుయి బీచ్‌ నుంచి స్కూబా డైవింగ్‌ చేశారు.

పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం

ఆయనకు సాయంగా నౌకాదళ డైవర్లు కూడా సముద్రంలోకి వెళ్లారు. సముద్ర గర్భంలో మోదీ పద్మాసనం వేసి, ముఖులిత హస్తాలతో శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. నెమలి ఈకలను సమర్పించారు. బయటకు వచ్చిన తర్వాత మోదీ మాట్లాడుతూ అత్యంత దివ్యమైన అనుభూతి కలిగిందని, ద్వారక సందర్శనకు ధైర్యంకన్నా విశ్వాసమే కీలకమని చెప్పారు. ప్రాచీన నగరాన్ని స్పృశించినప్పుడు 21వ శతాబ్దంలో వైభవోపేత భారతదేశం తనముందు కదలాడిందని, చాలాసేపు నీళ్లలోనే గడిపానని మోదీ తెలిపారు. ద్వారకను సందర్శించాలన్న తన కోరిక దశాబ్దాల నాటిదని, ఇప్పుడు అది పూర్తి కావటంతో అపరిమితమైన సంతోషం కలిగిందని మోదీ తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..
తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం …
రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..
ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని …
మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..
మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. …

Advertisements

You may also like

Our Visitor

014099
Total views : 78973

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.