కేంద్ర ఎన్నికల(Central Election) సంఘం నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ పథకాల విడుదలకు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలను వాయిదా వేయాలని ఈసీ స్పష్టం చేసింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఈసీకి ప్రతిపాదనలు పంపింది. అయితే, ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్నికలు ముగిశాకే ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని స్పష్టం చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఏపీ సీఎం జగన్ ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. చంద్రబాబు పై తీవ్రస్థాయిలో చేస్తున్న వ్యాఖ్యలపై ఈసీ హెచ్చరించింది. ఇలానే కొనసాగితే ప్రవర్తనా నియమాళి ఉల్లంఘించినట్లు భావించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రచారంలో జాగ్రతగా వ్యవహరించాలని ఈసీఐ జగన్ కు సూచించింది. కాగా జగన్ పై వ్యాఖ్యల నేపధ్యంలో చంద్రబాబును కూడా ఈసీ హెచ్చరించింది.
- మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
- పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
- కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్లుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అరవై గ్రామాలకు ఆరోగ్యదాయనిగా ఉన్న రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 80523