ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో గెలుపు ఓటముల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నరాలుతెగే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టారు. ఆ తర్వా నుండి ఈవీఎంల లెక్కింపు కొనసాగుతోంది. ఈవీఎంల్లో నమోదైన ఓట్ల లెక్కింపుకు ఒక్కో రౌండ్కు 20 నుంచి 25 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొవ్వూరు, నరసాపురంలో తొలి ఫలితం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో కేవలం 13 రౌండ్లలోనే తుది ఫలితం వెలువడనుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
భీమిలి, పాణ్యం ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. దీనికి కారణం 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఇక ఎంపీ స్థానాల విషయానికొస్తే.. మొదట రాజమండ్రి, నరసాపురం ఫలితాలు వెలువడుతాయి. ఆఖరుగా అమలాపురం ఎంపీ ఫలితం వెలువడుతుందని అధికారులు తెలిపారు. అమలాపురం స్థానంలో అత్యధికంగా 27 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. వీవీ ప్యాట్స్ లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు విడుదల చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ జరుగుతోంది.
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అస్వస్థత.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
- వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, కేసును ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో…
- అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది. దారకొండ, సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . రోజుకి 40 నుంచి 50 మంది పేషెంట్లు ఓపి కింద వస్తున్నారు .కొంతమంది ఆస్పత్రిలో చేరుతున్నారు…
- విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!విజయనగరం జిల్లా గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వెదుళ్లవలస మాజీ సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు, అప్పటి తహశీల్దార్ బంగార్రాజు కుమ్మక్కై సుమారు 24 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ రికార్డుల ద్వారా వారి కుటుంబ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 92742