8
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితుల్లో లేమని అన్నారు. ఎవరు కాల్చారు, ఏ ఉద్దేశ్యంతో కాల్చారో ప్రజలకు ప్రతిదీ బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలకు అర్థమయ్యేలా సమాధానం చెప్తామని.. విషప్రచారాలను కట్టడి చేస్తామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.




Total views : 92164