700 ఏళ్లుగా అఖండంగా వెలుగుతున్న దీపం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న ఈ దీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సీనియర్ సినీ నటులు, దర్శకుడు, న్యాయవాది సివిఎల్ నరసింహరావు ఆలయాన్ని కుటుంబ సభ్యులతో సందర్శించి రాములవారికి ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని శ్రీ సీతారామాల ఆలయానికి విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయా నికి రావడం తన పూర్వ జన్మ సుకృతమని ఆయన పేర్కొన్నారు. 700 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం, నాటి నుండి నేటి వరకు వెలుగుతున్న అఖండ జ్యోతిని దర్శించి పులకించి పోయామన్నారు. గత రెండు సంవత్సరాలుగా గంభీరావుపేట రావడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. నేటితో ఆ కోరిక తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. నవరాత్రుల్లో ప్రజ్వలింప చేసిన జ్యోతిని తొమ్మిది రోజులు కాపాడటమే కష్టమని, అలాంటిది 7 శతాబ్దాలుగా జ్యోతిని కాపాడంలో ఆలయ అర్చకులు, కమిటి సభ్యులు, స్థానిక ప్రజలు చూపుతున్న చొరవను ఆయన అభినందించారు. గాలిగోపుర నిర్మాణానికి తన వంతుగా 10వేల రూపాయలు విరాళంగా అందించారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.
9
previous post




Total views : 92164