Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Crime కామారెడ్డిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం.

కామారెడ్డిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం.

by CVR NEWS
crime

ఓ మహిళ కుళ్ళిపోయిన స్థితిలో విగతజీవిగా కనిపించిన ఘటన కామారెడ్డి పట్టణ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం శ్యామల భర్త రాజంతో కలిసి కామారెడ్డిలో కూలి పనికి వచ్చింది. అయితే రాజంకు పని దొరికి శ్యామలకు దొరకకపోవడంతో కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్లమని చెప్పి భర్త పనిలోకి వెళ్ళాడు .తర్వాత సదరు మహిళ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి కామారెడ్డిలో వెతకగా ఆచూకీ లభించకపోవడంతో కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం టర్నింగ్ వద్ద కలెక్టరేట్ వెళ్లే దారిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్ళిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది మృతురాలు హత్యకు గురైందా లేక ఇతర ప్రమాదం ఏదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020061
Total views : 92172

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.