తిరుమల (Thirumala) పుణ్యక్షేత్రంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. అన్ని గంటల పాటు క్యూలైన్లలో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే. ఇక వృద్ధుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉన్నప్పటికీ, ఆన్ లైన్ విధానం గురించి అవగాహన లేక వృద్ధులు అవస్థలు పడుతుంటారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. టీటీడీలో ప్రక్షాళనకు చంద్రబాబు సర్కారు నడుం బిగించింది. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లకు టీటీడీ నుంచి శుభవార్త వెలువడింది. వేంకటేశ్వరుని ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు రెండు టైమ్ స్లాట్లు ఏర్పాటు చేశారు. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అందుకోసం వృద్ధులు తమ ఫొటో ఐడెండిటీతో వయస్సు రుజువును సమర్పించాలి. సంబంధిత పత్రాలను ఎస్-1 కౌంటర్లో సమర్పించాలి. వృద్ధులు ఎక్కువ దూరం నుంచి క్యూలైన్లలో రావాల్సిన అవసరం లేకుండా… వంతెన కింద గ్యాలరీ నుంచి, ఎలాంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే దైవ దర్శనానికి వెళ్లొచ్చు. అంతేకాదు, వృద్ధుల కోసం మంచి సీటింగ్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యూలైన్లలో వృద్ధులకు వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు అందిస్తారు. క్యూలైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ స్పష్టం చేసింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి దర్శనం తర్వాత వృద్ధులు 30 నిమిషాల్లోపు ఆలయం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.
- భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతిగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27…
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపితిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ…
- తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబుప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.