తిరుమల (Thirumala) పుణ్యక్షేత్రంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. అన్ని గంటల పాటు క్యూలైన్లలో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే. ఇక వృద్ధుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉన్నప్పటికీ, ఆన్ లైన్ విధానం గురించి అవగాహన లేక వృద్ధులు అవస్థలు పడుతుంటారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. టీటీడీలో ప్రక్షాళనకు చంద్రబాబు సర్కారు నడుం బిగించింది. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లకు టీటీడీ నుంచి శుభవార్త వెలువడింది. వేంకటేశ్వరుని ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు రెండు టైమ్ స్లాట్లు ఏర్పాటు చేశారు. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అందుకోసం వృద్ధులు తమ ఫొటో ఐడెండిటీతో వయస్సు రుజువును సమర్పించాలి. సంబంధిత పత్రాలను ఎస్-1 కౌంటర్లో సమర్పించాలి. వృద్ధులు ఎక్కువ దూరం నుంచి క్యూలైన్లలో రావాల్సిన అవసరం లేకుండా… వంతెన కింద గ్యాలరీ నుంచి, ఎలాంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే దైవ దర్శనానికి వెళ్లొచ్చు. అంతేకాదు, వృద్ధుల కోసం మంచి సీటింగ్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యూలైన్లలో వృద్ధులకు వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు అందిస్తారు. క్యూలైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ స్పష్టం చేసింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి దర్శనం తర్వాత వృద్ధులు 30 నిమిషాల్లోపు ఆలయం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.
- కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్లుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అరవై గ్రామాలకు ఆరోగ్యదాయనిగా ఉన్న రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు…
- గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక, బూరుగులంక, గంటి పెదపూడి, ఉచ్చుల వారి పాలెం లంక గ్రామాల ప్రజలు.. ప్రతి సంవత్సరం గోదావరి నది వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద కష్టాల నుంచి గట్టేక్కేందుకు బ్రిడ్జి…
- నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది. గూడూరు, కోట ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రెవెన్యూ అధికారుల పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న గ్యాంగ్ వ్యవహారం బయటపడింది. రెండు రోజుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 80130