బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కేవలం బీసీలకు రెండు మంత్రి పదవులు ఇచ్చి చేతులు దులుపుకుందని… రానున్న మంత్రి వర్గ విస్తరణలో ప్రాధాన్యత గల ఐదు మంత్రి పదవులను కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా… బీసీ లకు ఎలాంటి న్యాయం చేయలేదని… కృష్ణయ్య బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మండిపడ్డారు. నామిటెడ్, కార్పొరేషన్ పదవులలో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బీసీ ల కులగణన చేయడంతో పాటు… పంచాయతీ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోటా పెంచాలని కోరారు. అలాగే వంద గురుకుల పాఠశాలలు, 50 ఇంజినీరింగ్ కళాశాలలు, రెండు విశ్వవిద్యాలయాలు నూతనంగా ఏర్పాటు చేయాలన్నారు. పెండింగులో ఉన్న బోధన రుసుములు, ఉపకార వేతనాలు చెల్లించి… పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగించడంతో పాటు… కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పందని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని, అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉబెర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్…
- ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగం దూసుకెళుతోందని, ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్…
- ఉప్పల్ ఆర్క గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో రూల్స్ ఉల్లంఘన..విద్య వ్యాపారంగా మారింది. పిల్లల చదువులను పెట్టుబడిగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాయి విద్యాసంస్థలు. ఇంటర్నేషనల్, గ్లోబల్ అని బోర్డులు తగిలించుకుని… తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఉప్పల్ పీర్జాదీగూడలోని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ సంగతి సరిగ్గా ఇదే. పేరుకు ఇంటర్నేషనల్ స్కూలే…
- అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ.. వీఎంఆర్డీఏ, పంచాయతీ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లతో కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. పెదరాంబద్రపురం, నామవరం పరిధిలోని పలు సర్వే నంబర్లలో…
- నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో బయటికొస్తున్నాయి. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 75406