నగర ప్రజలంతా తన కుటుంబ సభ్యులనీ… కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆదరణ, ఆశీసులు మెండుగా ఉన్నందునే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జెఎన్ రోడ్డులోని చెరుకూరి కన్వెన్షన్ హాల్లో గురువారం ఎన్డీయే కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. జగన్ పాలనలో ఐదేళ్ల పాటు మనమంతా చాలా ఇబ్బందులు పడ్డామని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. అధికార దురంహంకారంతో తనకు అసలు టిక్కెట్టే రాదని, రాజకీయాల్లో లేకుండా చేస్తామన్న ఒక వ్యక్తి ఇప్పుడు అసలు కనిపించకుండానే పోయాడన్నారు. నగరంలో ఐదేళ్ల పాటు పారిశుద్ధ్యాన్ని పక్కన పెట్టేశారని, అధికార దుర్వినియోగం చేస్తూ అనాలోచితంగా చేసిన పనులు కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, వాటన్నింటినీ సరి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి పని చేయాలి అని అధికారులకు సూచించామన్నారు. మాట వినని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ అధికారైనా మాట వినకపోతే తన దృష్టికి తీసుకువస్తే ఆ పని చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఆరోగ్యకర రాజమండ్రి కోసం కృషి చేస్తున్నామన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
- చెన్నై ఎగ్మూర్లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 194540