Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh సముద్రంలో మత్స్యకారుల పడవబోల్తా

సముద్రంలో మత్స్యకారుల పడవబోల్తా

by Rama
సముద్రంలో మత్స్యకారుల పడవబోల్తా

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సముద్రంలో పడవబోల్తా పడిన ఘటనలో ఆరుగురు మత్సకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వస్తున్నండగా ఈ ప్రమాదం జరిగింది.సముద్రంలో వేంగగా వీస్తున్న గాలులకు, ఎగసిపడతున్న అలల తాకిడికి బోటు ఇంజన్ ఆగిపోయింది.ఇంజన్ బోటు సముద్రంలో మునిగిపోతూ హాహాకారాలు చేస్తున్న మత్సకారులను రిలయన్స్ రిగ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మరోవైపు.. భైరవపాలెం, సావిత్రి నగర్ కు చెందిన మత్సకారులు నిన్నటి నుండి సముద్రంలోని సుమారు ఇరవై మైళ్ల దూరంలో రిగ్ వద్దనే చిక్కుకుపోయారు. వారిని తీసుకువచ్చేందుకు స్థానిక మత్స్యకారులు ప్రయత్నిస్తున్నారు. అలలు భారీగా ఎగసిపడడం, వేగంగా గాలులు వీస్తుండడంతో అక్కడికి చేరుకోలేక పోతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే తమవారిని సురక్షితంగా తీసుకురావాలని మత్స్యకారుల కుటుంబీకులు కోరుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039595
Total views : 198653

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: