107
ఆంధ్రప్రదేశ్లో గత కొద్దిరోజులుగా ఎల్పీజీ గ్యాస్ మరియు పెట్రోల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం త్వరలోనే తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం పోర్టుకు భారీ స్థాయిలో ఎల్పీజీ మరియు ముడి చమురును మోసుకొస్తూ రెండు భారీ నౌకలు చేరుకున్నాయి. యూఏఈ నుంచి ఈ నెల 20న బయలుదేరిన ఈ నౌకలు, తాజాగా వైజాగ్ హార్బర్ మౌత్ వద్దకు చేరుకుని లంగరేశాయి. ఈ రాకతో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరత తీరుతుందని, ముఖ్యంగా గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.





Total views : 78340