వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, కేసును ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో ప్రభుత్వం, నార్సింగి పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. సర్కారు భూములను అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం వెంటనే ఎలాంటి ఉపశమనం కల్పించలేదు. ప్రభుత్వ భూముల అంశం, రాజకీయ నాయకుడి ప్రమేయం, ముందస్తు బెయిల్ పిటిషన్ వంటి అంశాలు కలవడంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనుంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.
14



Total views : 92527