42
హైదరాబాద్ రాజ్ భవన్ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 29 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు PP నుంచి ఇంటర్ వరకు అల్పాహారం అందించనున్నారు. పాలు, రాగిజావ సైతం అల్పాహారంతో పాటు ఇవ్వనున్నారు. ఈ పథకంతో లక్ష 44 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్వినీ రెడ్డి, కలెక్టర్ ప్రియాంక ఆలా, డీఈవో యాదయ్య పాల్గొన్నారు. బ్రేక్ ఫాస్ట్ పథకం ద్వారా ప్రభుత్వంపై 720 కోట్ల రూపాయల భారం పడనుంది.




Total views : 146770