ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో.. ఆ బాలుడిని చూసేందుకు పవన్ వారి ఇంటికి వెళ్లారు. చాలా కాలంగా కాళ్లు పనిచేయక బాలుడు బాధపడుతున్నాడు. నరాల సంబంధిత వ్యాధి కారణంగా నిరంజన్ కాళ్లు పనిచేయడం లేదు. అతని వయసు 15 సంవత్సరాలైనా.. 2-3 ఏళ్ల బాలుడిగా కనిపించడం గమనార్హం. గాలిబుడగ లాంటి తన జీవితంలో పవన్ కల్యాణ్ ను కలిసి, ఆయనకు ఆయన సినిమాలోని డైలాగ్ వినిపించాలన్నదే చివరి కోరిక. ఆ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ నిరంజన్ ను పరామర్శించారు. బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి.. అతని ఆరోగ్య సమస్యలు, దాని చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో జనసైనికులతో ఏర్పాటు చేసిన లంచ్ లో పాల్గొని, తిరిగి విజయవాడకు వెళ్తారు. ఇటీవల హైదరాబాద్ జనసేన పార్టీ సభకు అనుమతి రాని నేపథ్యంలో.. తెలంగాణలో ఇదే పవన్ కల్యాణ్ తొలి పర్యటన అయింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్.
38
previous post




Total views : 146856