మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, పేదలకు అందుతున్న లబ్ధికి ఆకర్షితులయ్యారు. గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి స్థానిక గ్రామాల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులపై నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు ఈ భారీ చేరికల ప్రక్రియను స్థానిక కూటమి నాయకులు సమన్వయం చేసారు. మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు పార్లమెంటు ట్రెజ రర్ అంబవరం శ్రీనివాసరెడ్డి మండల పార్టీ కన్వీనర్ సర్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.
33
previous post