Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home International పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన క్రికెటర్

పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన క్రికెటర్

by Satya
Shakib Al Hasan

రాజకీయ నాయకుడిగా మారిన బంగ్లాదేశ్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలి విజయాన్ని అందుకున్నాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో మగురా-1 సీటు నుంచి పోటీ చేసి 1 లక్షా 50వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అవామీ లీగ్ పార్టీ తరపున పోటీ చేసిన ఈ ఆల్ రౌండర్ విజయాన్ని అందుకున్నాడు. తన సమీప అభ్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్‌కి 45వేల 993 ఓట్లు మాత్రమే పడడం గమనార్హం. కాగా ఎన్నికల ప్రచారం కోసం షకీబ్ అల్ హసన్ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. కాగా షకీబ్ చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాడు. బంగ్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్ కప్ తర్వాత బంగ్లాదేశ్ – న్యూజిలాండ్ తలపడ్డప్పటికీ షకీబ్ అల్ హసన్ ఆడలేదు.

Advertisements

You may also like

Our Visitor

013757
Total views : 78046

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.