టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. ఎవరు నడమవన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అంటూ విజయసాయి ఈ ఉదయం ట్వీట్ చేశారు.గాలికుంటు, బ్లూటంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబూ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని, అధికారం పోతే నీ బతుకేంటో తెలియక మెదడువాపు వ్యాధి వచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్నావని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. సప్తసముద్రాల అవతల దాక్కున్నా లాక్కొచ్చి తిన్నదంతా కక్కిస్తామన్నారు. పేలిన ప్రతీ తప్పుడు కూతకీ వాత పెట్టించి, బొక్కలో వేస్తామంటూ విజయసాయి రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విజయసాయిరెడ్డికి అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ రిప్లై
409
previous post




Total views : 196780