కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం 14వ వార్డు నూకాలమ్మ ప్రక్క వీధిలో యండి.రాజు అనే ఫాస్టర్ తన ఇంటిని చర్చ్ గా మార్చి, రాత్రనకా పగలనకా ప్రార్ధనల పేరుతో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో నివాస స్థలాల మధ్య ఉన్న కుటుంబాలకు విపరీతమైన భంగం కలిగించడమే కాకుండా, హిందూ దేవుళ్ళను తిడుతూ, భయంకరంగా అరుస్తూ ఏడుస్తుంటే చుట్టు పక్కల వారు భయంతో, మాకు పిల్లల చదువులు, పెద్దలు అనారోగ్యంతో ఉన్నారని కాస్త సౌండ్ తగ్గించమని చెప్పిన, వీళ్లను బెదిరిస్తూ, మీరు మా మతం లోకి మారకపోతే మీరు నాశనమోతారని బెదిరిస్తుంటే, ఎన్నో సార్లు అధికారులకు కంప్లైంట్ చేసిన, వీరి బాధను తీర్చడానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని గత కొన్ని సంవత్సరాలుగా ఈ బాధ అనుభవిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. చర్చ్ ప్రక్కనే నివశిస్తున్న ఒక వ్యక్తికి వీరు చేస్తున్న అసందర్భ కార్యకలాపాల వలన పెరాలసిస్ కి గురవ్వడం జరిగింది అని అంటున్నారు. ఈరోజు శుక్రవారం స్థానిక హిందువులు తమ ఆవేదనను పోలీసులకు ఫిర్యాదు చేశారు, అక్కడి హిందువులు అందరూ మా వేదనను గుర్తించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తే మాకు చావే శరణ్యం అని వారి వేదన తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని కొంతమంది స్థానికులు విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర రావు హిందూ, సురేంద్ర దత్త కి ఫోన్ చేసి తెలియజేయగా, హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి హిందువులకు అండగా నిలిచి, వారి మనోవేదనను అధికారులతో మాట్లాడి, ఆ అక్రమ చర్చిని సీల్ చేసి విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు.
East Godavari
మహేందర్ మృతికి నాకు ఎటువంటి సంబంధం లేదు కావాలనే నామీద బురద జల్లే
ప్రయత్నం చేస్తున్నారు మహేందర్ ఆసుపత్రిలో జాయిన్ అయిన దగ్గర్నుంచి వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని డాక్టర్లకి సూచించానని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి సిఐడి ఎంక్వయిరీ వెయ్యమని కోరగా సిఐడి ఎంక్వయిరీ కి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించరు ఈ ఎంక్వైరీలో మహేందర్ మృతి వెనక నిజ నిజాలు నిగ్గు తేలతాయి అనిజనసేన పార్టీ కి చెందిన నాయకులు దురుద్దేశంతో ఆరోపణ చేస్తున్నారనిహోంమంత్రి ఆరోపించారు.
Read Also…
Read Also…
కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎస్సైగా పనిచేస్తున్న D.భూషణం గారు ది 13-10-2023 తేదీన కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొమ్మేరు గ్రామంలో ఒక ఫ్లెక్సీ చించిన వివాదంపై రెండు వర్గాల మధ్య గొడవలు జరుగు చున్నవనే సమాచారంతో, దొమ్మేరు గ్రామానికి చెందిన బొంతా మహేంద్ర, తండ్రి: శ్రీనివాసరావు, వయసు 21 సం. లు, కులం: మాల అనువానిని కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి, యేవిదమైన కేసు నమోదు చేయకున్నప్పటికీ సాయంత్రం వరకూ అనగా ది.13.11.2023 సాయంత్రం 05.00 గం. ల వరకూ పోలీస్ స్టేషన్ లో వుంచినట్లు, ఆ వ్యక్తిని టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు పోలీస్ స్టేషన్ కి వచ్చిన వెంటనే, అతని బందువులకు అప్పగించి యింటికి పంపినారు. ఆ తరువాత అనగా 13/14.11.2023 రాత్రి సదరు బొంతా మహేంద్ర తన యింటివద్ద పురుగుమందు త్రాగి ఆత్మహత్య కు ప్రయత్నించగా, అతని స్నేహితులు, బందువులు అతనిని మొదట కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడినుండి చాగల్లు ప్రయివేటు ఆసుపత్రికి, అక్కడినుండి పోలీస్ వారి సహాయంతో రాజమహేంద్రవరం రవి కిడ్నీ & చిల్డ్రన్ హాస్పిటల్ కి, అక్కడినుండి KIMS బొల్లినేని హాస్పిటల్కి తరలించి, వైద్య సహాయం అందజేసి, అతని ఆరోగ్యం కుదుటపడనందున అతనని ది.14.11.2023 రాత్రి విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యం పొందుతూ ది.15.11.2023 తెల్లవారుజామున మరణించారు. సదరు బొంత మహేంద్ర తనను పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లినందుకు మనస్తాపానికి గురై పురుగు మందు త్రాగానని చెప్పటంవల్ల, అతనిని కొవ్వూరు టౌన్ SI D. భూషణం గారు ఏవిదమైన కేసు నమోదు చేయకుండా, తన పై అధికారులకు సమాచారం యివ్వకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకురావటమే కాక, సాయంత్రం వరకూ ఎటువంటి విచారణ లేకుండా నిర్భందించి నందున, సదరు బొంత మహేంద్ర నిర్భందానికి దారితీసిన పరిణామాలపై ఎస్పీ గారు విచారణ చేసి SI D.భూషణం గారిపై ప్రత్యేక నివేదిక ఏలూరు డిఐజి గారి పంపగా డిఐజి గారు తక్షణమే కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేయుచున్న SI D.భూషణం గారిని సస్పెండ్ చేయడం జరిగినది.
ఈ సంఘటన ద్వారా జిల్లా పోలీసు అధికారులు తమ సిబ్బంది కేసులలో నిదితులను గాని, నిందితులు కానీ వారిని కానీ, 7 సం. వరకూ శిక్ష విధించదగ్గ కేసులలో ముద్దాయిలను గానీ, విచారణ కొరకు గానీ, మరియే యితర అవసరానికి గానీ సరయిన నోటిస్ అమలు చేయకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకు రాకూడదని, అట్లు చేసినయెడల డిపార్ట్మెంట్ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా పోలీస్ శాఖలో యెవరైనా క్రమశిక్షణ తప్పినా, విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా, పోలీస్ శాఖ తీసుకొనే చర్యలు తీవ్రంగా వుంటాయని, ఈ విషయం దృష్టిలో వుంచుకొని సిబ్బంది వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వహించాలని ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు తెలియ పరిచినారు.
Read Also..
తూర్పు గోదావరి జిల్లా…
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పీ ఏ చంద్రశేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ్ కుమార్ దాడి తలపై రక్తస్రావం జరిగేలా తీవ్రంగా దాడి చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ్. తక్షణమే కానిస్టేబుల్ కరుణ్ సస్పెండ్ చేయాలని రాజమండ్రి రామాలయం సెంటర్ లో నడి రోడ్డు పై కూర్చుని నిరసన తెలుపుతున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి.
Read Also….
పవిత్ర కార్తీక మాసం ను పురస్కరించుకుని ముమ్మిడి వరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు……. అమలాపురం నకు చెందిన గుడివాడ రాంబాబు దంపతులు,కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో సూరేశ్వర స్వామి కి కలసాలతో, ప్రత్యేక ద్రవ్యాలు తో ,లక్షపత్రులతో పూజలు నిర్వహించారు…ఈ కార్యక్రమంలో అదిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read Also…
వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆకాంక్షించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని కాబట్టి ప్రజలు కూడా వైఎస్ జగన్ను మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. వైఎస్ జగన్ నిరంతరం పేదల కోసం పరితపిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట వ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు జరగుతున్నాయని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేశాడని ఆరోపించారు. బంగారు రుణాలు మాఫీ అంటూ చేతులెత్తేశాడు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్ కల్యాణ్ పాత్ర కూడా ఉందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి అందిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మ ఒడి లాంటి పథకం లేదని చెప్పుకొచ్చారు. పేదల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం జగన్ రాష్ట్రానికి కావాలి. మళ్లీ ఆయనే సీఎం కావాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. 2024లో పేదలకు-పెత్తందారులకు ఎన్నికలు జరుగుతున్నాయని పేదల తరపున పోటీ చేసి గెలిచే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును భుజానికి ఎత్తుకున్నాగెలిచేది వైఎస్ జగనే అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
అనేక శివలింగములు ప్రతిష్ఠించి పుష్పక మెక్కి గౌతమి పశ్చిమ తటక మునకు వచ్చు సరికి పుష్పకము కదలలేదు. ఇందు క్షేత్రవిశేషము కలదని పరిశోధించగా ఒక పుట్ట కనబడెను. దానిని ఛేదించి అందు తపము ఆచరించుచున్న స్త్రీని చూచి, నీవు ఎవరవు అని అడుగగా ఆమె తన వృత్తాంతమును ఈ విధముగా వివరించెను. ఉత్కళ దేశమందు ఓడ్ర పుండ్రకమను పేరుగల నగరములో సోమశర్మ అను ముని ఉండెను. అతని కుమారుడు జయభద్రుడు. నేను అతని భార్యను నా పేరు శ్రమణి. నా రూపమును చూసి ఒక గంధర్వుడు నా పతి స్నానార్ధమై వెళ్ళిన తరువాత నా పతిరూపములో వచ్చి కామలీలయందు ప్రయత్నించుచుండగా నా భర్త వచ్చి తన రూపంలో నున్న గంధర్వుని భస్మము చేసేను. కృతాంజలిగా నున్న నన్ను చూచి నీవు ఛండాల స్త్రీగా అగుమని శపించెను. శాపగ్రస్తురాలలైన నేను మామగారి వద్ద మొర పెట్టుకొనగా, వారు దివ్యదృష్టి జరిగినది తెలుసుకొని గౌతమి నదిలో స్నానమాత్రముచే పాప పరిహారమగును. శివశివయని ఘోర తపము చేయుటవలన త్రేతాయుగములో శ్రీరామచంద్రుని దర్శన భాగ్యముచే నీవు ముక్తిని పొందగలనని చెప్పి వెళ్లిరి. అది మొదలు ఇప్పటివరకు తపము చేయుచుండె నని చెప్పెను. అంతట శ్రీరాముడు ఈశ్వరుని ప్రార్ధించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై శ్రీరాముని ఆలింగనము చేసుకొనేను అంతట శ్రీ రాముడు ఈశ్వరా ! ఈ శ్రమణికి ముక్తిని ప్రసాదించమనియు, ముక్తి ఇమ్మని సర్వజనులు నిన్ను చూచిన క్షణకాలములో ముక్తినొందు వరము ప్రసాదించమని ప్రార్థించి, ఒక శివలింగము ప్రతిష్ఠించెను. అందువలన ఈ క్షేత్రము క్షణ ముక్తేశ్వర క్షేత్రముగా వెలుగొందుచున్నది.
తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం నియోజకవర్గం.. తెల్లవారుజామున ఐదుగురు వ్యక్తులు నన్నయ్య యూనివర్సిటీ సమీపంలో పిడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనం ఆపి లక్ష రూపాయలు నగదు డిమాండ్ చేశారు. పిడిఎస్ బియ్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం తో విలేకరితో వచ్చామని లక్ష రూపాయలు ఇవ్వకపోతే కేసులు పెడతాం అంటూ నకిలీలు నగదు డిమాండ్ చేశారు. కార్ లో విజిలెన్స్ అధికారులు ఉన్నారంటూ, అడిగిన నగదు ఇవ్వకపోతే జైలుకు పంపుతామంటూ వ్యాన్ లో ఉన్న వ్యక్తి కి బెదిరించారు. నూజివీడు నుండి కాకినాడ వైపు తరలిస్తుండగా రాజానగరం లొ పిడిఎస్ బియ్యం వాహనాన్ని ఆపిన ఐదుగురు వ్యక్తులలో ఇద్దరు నకిలీలు.. హైవే పై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు చిక్కారు. 20 వేలు నగదుతో మరికొంతమంది వ్యక్తులు పరారయ్యారు. పిఠాపురం కు చెందిన బాధితుడు సంగుల వరప్రసాద్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. గతంలో ఇదే వాహనం పలుమార్లు ఆపి నగదు తీసుకున్నట్లు దర్యాప్తులో తెలిసిందని సిఐ కాశీ విశ్వనాధ్ వెల్లడించారు.
రైతులను ఆదుకోవడమే ధ్యేయముగా పనిచేస్తున్న జగన్ ప్రభుత్వంలో పామాయిల్ రైతులకు 250 కోట్ల రూపాయల వ్యయంతో 3F ఆయిల్ ఫామ్ ఫాక్టరీ రైతులకు అందుబాటులో ఉండేలాగా మెట్ట ప్రాంతంలో నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యావరం గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యేలు తలారి వెంకటరావు కొఠారు అబ్బాయి చౌదరి పాల్గొన్నారు… మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందుగా భూమి పూజ చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు…అనంతరం మంత్రి గోవర్ధన రెడ్డి మాట్లాడుతూ గతంలో 20.000 పలికే పామ్ ఆయిల్ ధర ప్రస్తుతం 13000 రూపాయలు మాత్రమే ధర పలకడంతో పామాయిల్ రైతులు తీవ్ర నష్టంలో కురిపోయిన విషయం తెలిసిందేనని దీనిపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డి కేంద్రంతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తున్నరని అన్నారు మంత్రి గోవర్ధన్ రెడ్డి… మెట్ట ప్రాంత రైతులకు నూతన పామాయిల్ ఫ్యాక్టరీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధికి దొరుకుతుందని, పామెయిల్ రైతులకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు…భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో 90% ఫామిలీ పంట కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే అది కూడా అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉందని పామెయిల్ పంటను సాగు చేయడం జరుగుతుందని మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు …
రైతులను ఆదుకోవడమే ధ్యేయముగా పనిచేస్తున్న జగన్ ప్రభుత్వంలో పామాయిల్ రైతులకు 250 కోట్ల రూపాయల వ్యయంతో 3F ఆయిల్ ఫామ్ ఫాక్టరీ రైతులకు అందుబాటులో ఉండేలాగా మెట్ట ప్రాంతంలో నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకన గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు.తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యావరం గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు తలారి వెంకటరావు కొఠారు అబ్బాయి చౌదరి పాల్గొన్నారు…మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుగా భూమి పూజ చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు…అనంతరం మంత్రి గోవర్ధన రెడ్డి మాట్లాడుతూ గతంలో 20.000 పలికే పామ్ ఆయిల్ ధర ప్రస్తుతం 13000 రూపాయలు మాత్రమే ధర పలకడంతో పామాయిల్ రైతులు తీవ్ర నష్టంలో కురిపోయిన విషయం తెలిసిందేనని దీనిపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డికేంద్రంతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తున్నరని అన్నారు మంత్రి గోవర్ధన్ రెడ్డి…మెట్ట ప్రాంత రైతులకు నూతన పామాయిల్ ఫ్యాక్టరీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధికి దొరుకుతుందని, పామెయిల్ రైతులకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు…భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో 90% ఫామిలీ పంట కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే అది కూడా అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉందని పామెయిల్ పంటను సాగు చేయడం జరుగుతుందని
మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు …




Total views : 61675