Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సండ్ర వెంకటవీరయ్య..

ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సండ్ర వెంకటవీరయ్య..

by Prakash
sandra venkata veeraiah

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం 10 సంవత్సరాల కాలం కుటుంబాన్ని వదిలేసి, అవమానాలు పడి పోరాటం చేసి తెలంగాణ ను సాధించిన వ్యక్తి కేసీఅర్ అని అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరుకున్నారు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి. బిఅర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామం లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఅర్ పాలనలో గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని, వెనకబడిన గ్రామాలు నేడు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందాయి అని కొనియాడారు. సీతారామ ప్రాజెక్ట్ తో జిల్లా సస్యశ్యామలం కానుందని వివరించారు. కేసీఅర్ ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ప్రతి వర్గానికి ఉపయోగ పడుతుంది అన్నారు. జనవరి నుండి ప్రతి మహిళకు సౌబాగ్యా లక్ష్మి పథకం పేరుతో మూడు వేలును కేసీఅర్ అందించనున్నారు అని పేర్కొన్నారు. కార్ గుర్తుకు ఓటు వేసి బిఅర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుకున్నారు.

Read Also…

Read Also…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: