Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh రైతులను ఆదుకోవడమే ప్రభుత్వద్యేయం..

రైతులను ఆదుకోవడమే ప్రభుత్వద్యేయం..

by Prakash
kakani govardhan reddy

రైతులను ఆదుకోవడమే ధ్యేయముగా పనిచేస్తున్న జగన్ ప్రభుత్వంలో పామాయిల్ రైతులకు 250 కోట్ల రూపాయల వ్యయంతో 3F ఆయిల్ ఫామ్ ఫాక్టరీ రైతులకు అందుబాటులో ఉండేలాగా మెట్ట ప్రాంతంలో నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకన గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు.తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యావరం గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు తలారి వెంకటరావు కొఠారు అబ్బాయి చౌదరి పాల్గొన్నారు…మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుగా భూమి పూజ చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు…అనంతరం మంత్రి గోవర్ధన రెడ్డి మాట్లాడుతూ గతంలో 20.000 పలికే పామ్ ఆయిల్ ధర ప్రస్తుతం 13000 రూపాయలు మాత్రమే ధర పలకడంతో పామాయిల్ రైతులు తీవ్ర నష్టంలో కురిపోయిన విషయం తెలిసిందేనని దీనిపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డికేంద్రంతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తున్నరని అన్నారు మంత్రి గోవర్ధన్ రెడ్డి…మెట్ట ప్రాంత రైతులకు నూతన పామాయిల్ ఫ్యాక్టరీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధికి దొరుకుతుందని, పామెయిల్ రైతులకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు…భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో 90% ఫామిలీ పంట కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే అది కూడా అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉందని పామెయిల్ పంటను సాగు చేయడం జరుగుతుందని
మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు …

Advertisements

You may also like

Our Visitor

026181
Total views : 150007

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.