అప్పట్లో కేంద్రీయ విద్యాలయం కడతామంటే పది ఎకరాలు ఇచ్చేసి నాలుగు ఎకరాలు మా గ్రామానికి ఉంచుకుంటామని తెలిపాం. కానీ కేంద్రీయ విద్యాలయం కట్టకుండా అది ఎక్కడికో మార్పు చేసి ఇప్పుడు మొత్తం కూడా కబ్జా చేయడానికి పాల్పడుతున్నారని.. వీటిని మేము సహించమని కొండూరు శరత్ కుమార్ తెలిపారు. రాజంపేట మున్సిపాలిటీని చూస్తే మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. రాజంపేటలో ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ మురికి అక్కడే ఉంది. ముందు దాని సంగతి చూడండి. కుక్కలకు, పందులకు నిలయంగా మారిన రాజంపేట మున్సిపాలిటీ, రోడ్లపై ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్యలు.. కొద్దిపాటి వర్షానికి రోడ్లంతా డ్రైనేజీతో జలమయం అయిపోతాయి వాటిని అభివృద్ధి చేయండి. మున్సిపాలిటీ ప్రజల క్షేమాన్ని ముందు చూడండి. అత్యవసరంగా శిల్పారామం కట్టాల్చినంత అవసరం లేదు. అంత అవసరం అని భావిస్తే రాజంపేట మున్సిపాలిటీ స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ కట్టుకోండి. మా గ్రామ పంచాయతీలోని స్థలం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మాత్రమే ఈ స్థలాన్ని ఉపయోగించుకుంటాం. గ్రామపంచాయతీ సర్పంచ్ రెజల్యూషన్ లేకుండా పంచాయతీ స్థలం శిల్పారామం కు ఎలా కేటాయిస్తారు? ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీల వరకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం. మా పంచాయతీ స్థలాన్ని మేమే ఆక్రమించి గ్రామపంచాయతీ డెవలప్మెంట్ కు ఉపయోగిస్తాం. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు..
Kadapa
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల వద్ద ట్రాక్టర్ బోల్తా పడి 12 మంది విద్యార్థులకు గాయాలు. ఇద్దరు విద్యార్థులకు కాళ్ళు చేతులు విరిగి తీవ్ర గాయాలు కాగా కడప రిమ్స్ కు తరలించారు.విద్యార్థులంతా లింగాల మండల కేంద్రం లోని బిసి హాస్టల్ చెందిన విద్యార్థులుగా గుర్తించారు. వీరంతా ఈరోజు సెలవు కావడంతో లింగాల గ్రామం శివార్లలో ఉన్న కాశీనాయన గుడి ఆరాధనా ఉత్సవాలు జరుగుతుండగా హస్టల్ సిబ్బంది ట్రాక్టర్ లో విద్యార్థులను తీసుకెళ్ళినట్లు సమాచారం. హాస్టల్లో భోజనం చేయకుండా విద్యార్థులందరనీ గుడి దగ్గర పెట్టే బోజనాలకు తీసుకెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి 20 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమం కావడంతో ఆ ఇద్దరినీ కడప రిమ్స్ తరలించారు.
ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని.. దీంతోనే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలను అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ హై స్కూల్ మైదానం నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్, జేసి ఫర్హాన్ అహమ్మద్, ఇండియన్ వాలి బాల్ క్రీడా కారిణి, ఆడుదాం ఆంధ్ర జిల్లా అంబాసిడర్ వసుమతిలు హాజరయ్యరు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆడుదం ఆంధ్రా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలియపరిచారు. అనంతరం జిల్లా అంబాసిడర్ వసుమతి కలెక్టర్ ఎమ్మెల్యేలకు క్రీడా జ్యోతిని అందజేశారు. అనంతరం జాతీయ జెండా ను ఆవిస్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించి బెలూన్లతో పాటు పావురాలను ఎగుర వేసి క్రీడలను ప్రారంబించారు. కబడ్డీ, కో-కో, వాలి బాల్ క్రీడలకు ఏర్పాటు చేసిన మైదానం ను వారు పరిశీలించారు. అనంతరం వాలి బాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో సరదాగా కాసేపు వాలి బాల్ ఆడారు. ఎమ్మెల్యే, కలెక్టర్, జేసి, జిల్లా అంబాసిడర్ లు కాసేపు వాలి బాల్ క్రీడలను ప్రత్యేక్షంగా చూసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష యాబై వేలకు పైగా ఆడుదాం ఆంధ్రా లలో ఆడేందుకు క్రీడాకారులు రిజిస్టర్ చేసుకోన్నారన్నారు. యువతలో ప్రతిభను వెలికి తీసేందుకే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తిసుకువచ్చ్చారన్నారు. యువత మన రాయచోటి నుండి ఐపిఎల్ తో పాటు జాతీయ స్థాయిలో ఆడాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. రాయచోటి జిల్లా కేంద్రం అయిన తర్వాత క్రీడా మైదానం కు 27 ఎకరాలు స్థలాన్ని కేటాయించడమే కాకుండా త్వరితగతిన అన్ని రకాల వసతులతో క్రికెట్ స్టేడియాన్ని పూర్తీ చేసినందుకు కలెక్టర్ గిరిషా పీఎస్ కు ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఆ స్టేడియంలో జాతీయ స్థాయి టోర్నమెంట్ లు జరిగేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడలను యువత, విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని మన జిల్లా కు మంచి పేరు ప్రఖ్యాతలు తేవలాని మనస్పూర్తిగా కోరుకొంటున్నట్లు ఈ సందర్బంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో రంగ స్వామి, మున్సిపల్ కమీషనర్ గంగ ప్రసాద్, రెవెన్యు అధికారులు, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, వైకాప నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఎపి రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్య పడుతుందన్నారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, జనసేన నేత అత్తిగారి దినేష్. అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరు లో టీడీపీ నేతలు గగ్గుటూరి ఖాదర్ బాషా గగ్గుటూరి హుమయూన్ ఆధ్వర్యం బాబు సూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, జనసేన నేత అత్తిగారి దినేష్ ఇరువురు హాజరయ్యారు. ర్యాలి తో పాటు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు రాబోవు ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే నేవేర్చే హమిలన్నింటిని కుడా ప్రజలకు కరపత్రాల ద్వారా చైతన్య వంతులను చేస్తూ వారి ప్రచారం కోనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి ఒక జాబు క్యాలెండర్ అన్నారు మరి నాలుగన్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎన్ని జాబు క్యాలెండర్లు విడుదల చేసారో యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో ఎ ఒక్కరు సంతోషంగా లేరని ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్ ప్రభుత్వాన్నిఎప్పుడు గద్దె దించూదామా అన్నట్టు ప్రజలు ఎదురు చుస్తున్నరన్నారు. జగన్ సామజిక బస్సు యాత్ర కేవలం సోకు మాత్రమే తప్ప ప్రజలలో మాత్రం ఎటువంటి స్పందలేదన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలన్న రాష్ట్రంలో సిఎం గా చంద్రబాబు గారు రాజంపేట ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్ధులను కచ్చితంగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా కష్ట పడలన్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి ఓటమి భయం పుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, పార్టీ నాయకుల, కార్యకర్తలు తో పాటు మైనార్టీ నాయకుల పాల్గొన్నారు.
తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి వర్కర్స్ & హేల్పర్స్ యునియన్ అద్వర్యంలో తలపెట్టిన అంగన్ వాడి నిరవధిక సమ్మె 14 వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం చాల బాధకరం అన్నారు. అంగన్ వాడి నాయకురాలు మసృన్ బీ, చిన్నమండెం మండలం కార్యదర్శి ఉమా రాణి. 14 వ రోజు నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్డివో కార్యాలయం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు సమాన పనికి సమాన వేతనం 26 వేల వేతనాన్ని అందజేయలన్నారు. అదే విధంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన మహిళల పట్ల వైసిపి నాయకులు అనేక అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అంగన్ వాడి తాళాలు పగల గొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు పడాల్సింది పోయి తమను తాము సమర్దించు కోవడం చాల సిగ్గు చేటన్నారు. నెల నెలకు అందని వేతనాలతో, చాలీ చాలని వేతనాలతో, అంగన్ వాడి కేంద్రాల అద్దెలు చెల్లించుకోలేక, కూరగాయలు, గ్యాస్, టి ఎ డి ఎ బిల్లులు రాకపోవడంతో అంగన్ వాడిలు ఆర్దికంగా అనేక దుర్బర దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని యెడల రానున్న రోజుల్లో అంగన్ వాడి మహిళల శక్తి ఏంటో ప్రభుత్వానికి తెలియజేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ పరిదిలోనున్న అంగన్ వాడి వర్కర్లు హేల్పర్లు పాల్గొన్నారు.
Read Also..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను సీఎం జగన్, వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. వారితోపాటు ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటి సీఎం అంజాద్ బాషా, మంత్రి అదిమూలపు సురేష్ కార్యక్రమానికి హాజరైయ్యారు. సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also..
Read Also..
ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు కూడా నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎంతో పాటు నివాళులు అర్పించిన వారిలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం జగన్ నివాళులు అర్పించిన అనంతరం ఇడుపులపాయ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలకు హాజరయ్యారు. సీఎం జగన్ ప్రతి ఏడాది క్రిస్మస్ కు ఇడుపులపాయ వస్తారని తెలిసిందే. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరుకానున్నారు.
రాయచోటి లో మానవత సంస్థ నెలవారీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా జిల్లా అసిస్టెంట్ ట్రేజరర్ హరిత, లక్కిరెడ్డి పల్లి వ్యవసాయ అధికారి రమేష్, సీనియర్ సాఫ్ట్వేరే మల్లికార్జున రెడ్డి, మానవత సభ్యలు, డి సి సి బ్యాంక్ అసిస్టెంట్ మేనజర్ రమణా రెడ్డి, విల్వపతి రెడ్డి లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థ సేవకు నిదర్శనం మానవతా సంస్థ అని కొనియాడారు. రాయచోటి లో రాయచోటి, చిత్తూరు రింగ్ రోడ్డు నందు మానవత అధ్యక్షులు చింతం రెడ్డి వెంకట్రామి రెడ్డి, సెక్రెటరి వెంకటరమణ నాయుడు, ఉపాధ్యక్షులు సంచుల ఖాదర్ బాషా ఆధ్వర్యంలో మానవత నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సచివాలయంలో పంచాయతి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ ఇటివలే గ్రూప్ 1 పరిక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ సాధించి జిల్లా అసిస్టెంట్ ట్రెజరర్ గా విధులు నిర్వహిస్తున్న హరిత దంపతులు హజరయ్యారు. వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మానవత సంస్థ సేవలు కు గాను పది వేల నగదు విరాళాన్ని అందజేశారు. అదేవిధంగా సంబేపల్లి మండలం వాసి సీనియర్ సాఫ్ట్ వేరే మల్లికార్జున కుడా ముఖ్య అతిధిగా హాజరై మానవత సంస్థ కు ఫ్రీజర్ బాక్స్ ను అందజేస్తానని తెలియజేశారు. మానవత సభ్యులు విల్వపతి రెడ్డి దగ్గర నమ్మకస్తుడైన కీ..శే..లు రామజోగి జ్ఞాపకార్థం పది వేలు నగదు విరాళాన్ని మానవత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతోనే రామచంద్ర రెడ్డి గారు మానవత సంస్థను ఏర్పాటు చేసి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించుచుండడం చాల అభినందనియమన్నారు. ప్రతి ఒక్కరు కుడా సమాజ శ్రేయస్సు కోసం వారి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని జిల్లాల్లో కుడా మానవత సంస్థలు కమిటిలు ఏర్పాటు చేసి ప్రముఖులు దాతల సహకారంతో సేవలు చేసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలు చేస్తున్నట్లు మానవత కుటుంబ సభ్యులు వివరించారు. మానవత సంస్థ వారు అంబులెన్స్, శాంతి రథం, ఫ్రీజర్ బాక్స్ లు 24 x7 రాయచోటి పరిసర ప్రాంత ప్రజలకు సేవలు అందజేస్తున్నామన్నారు. మానవత నెలవారీ సమావేశానికి ముఖ్య అతిధిలుగా హాజరై ప్రజలకు సేవలు అందించ్చేందుకు నగదు విరాళంతో పాటు బాడి ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన వారికీ వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అతిధిలుగా హాజరైన వారిని శాలువాతో సన్మానించి మానవత మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సంచుల ఖాదర్ బాష, కేంద్ర కమిటి సభ్యులు సహదేవ రెడ్డి, జిల్లా కమిటి సభ్యులు ఆనంద్ రెడ్డి, కో చైర్మన్ షకీల్, సభ్యులు శ్రీదర్ రెడ్డి, తాతి రెడ్డి, రెడ్డప్ప రెడ్డి, సుబ్బారెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు కడప జిల్లా పర్యటనలో భాగంగా సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్కు చేరుకుంటారు. ఘాట్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని 11.30 వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సింహాద్రిపురం జూనియర్ కళాశాల సమీపాన ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. 12.40 గంటల వరకు సింహాద్రిపురం మండల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. అనంతరం సింహాద్రిపురంలోని రోడ్డు వెడల్పు, సుందరీకరణ, వైఎస్సార్ పార్క్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్లో దిగుతారు. ఎకో పార్క్ మీటింగ్ ప్రదేశానికి చేరుకుంటారు. పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 4.45 గంటలకు గెస్ట్హౌస్కు చేరుకుని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.
Read Also..
Read Also..
వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం చాకిబండ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ జడ్పీటీసీ మద్దిరేవుల బయారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్దిరేవుల కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎపి ఫైబర్ ఎం డి మధుసూదన్ రెడ్డి దంపతులతో పాటు మాజీ జడ్పిటిసి సభ్యులు మద్దిరేవుల శ్రీనివాసులు రెడ్డి దంపతులు స్వామి వారికీ కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు చాకిబండ గ్రామాల ప్రజలే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కుడా భారీగా తరలి వచ్చారు. కళ్యాణ మహోత్సవం కార్యక్రమం అనంతరం ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయ కమిటి సభ్యులు ఏర్పాట్లు చేశారు. దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మద్దిరేవుల బయారెడ్డి కుటుంబ సభ్యుల అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చాకిబండ గ్రామా ప్రజల సహకారంతో ఎంతో పురాతనమైన ఆలయం ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రజల్లో భక్తి భావం పెంపొందించే విధంగా ఆలయాల అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రజల సహకారంతో చాకిబండ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. గ్రామస్తులు ఎల్లమ్మ దేవాలయాన్ని కుడా అభివృద్ది చేయాలనీ తమను కోరారు అని ప్రజల సహకారంతో ఆ అమ్మవారి గుడిని కుడా నిర్మించేందుకు శ్రీకారం చుడతామన్నారు. ప్రజల ఎల్లా వేళల అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కరించడమే కాకుండా పురాతన ఆలయాలను అభివృద్ధి పరుస్తూ ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు ఆహార్నిషులు కృషి చేస్తున్న మద్దిరేవుల బయారెడ్డి కుటుంబానికి చాకిబండ గ్రామా ప్రజలు అండదండలు ఉంటాయన్నారు .




Total views : 197141