మచిలీపట్నం టీడీపీ పార్టీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పేర్ని నానిపై ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పెడితే పళ్ళు రాలుతాయని మాస్ వార్నింగ్ ఇచ్చారు. పట్టాల ముసుగులో నాలుగు కోట్ల బేరం త్వరలోనే బయటపెడతామన్నారు. 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ పెట్టుకుని పేర్ని నాని అసైన్డ్ భూమికి పట్టాలు ఇస్తామంటూ డ్రామాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీ వెళితే వైసీపీ పేటీఎం బ్యాచ్ కి ప్యాంట్లు తడుస్తున్నాయన్నారు. ఇక వాళ్ళ నాయకుడు జగన్ ఢిల్లీకి వెళ్లి ఏం సాధించాడో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ, జనసేన పొత్తు ప్రజలు కోరుకున్నదని ఆయన స్ఫష్టం చేశారు. పేర్ని నాని మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తప్పుడు కూతలు కూస్తే ప్రజాక్షేత్రంలో రాజకీయ వస్త్రాపహరణ తప్పదని హెచ్చరించారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.





Total views : 79366